యూనిట్
Flash News
మంచి కథ


జీవన నైపుణ్యం
''మంచేదో, చెడేదో తెలీని ఎర్రిబాగులోణ్ణి కాదు. అన్నిందాల ఆలోచించే శీనయ్యకు మాటిచ్చాను'' ఘంటాపథంగా నొక్కి మరీ చెప్పాడు పానకాలు. ''మాటిచ్చే ముందు ఇంటో వాళ్లకు చెప్పక్కర్లేదా?'' ''ఏం, చెప్పిగాని చెయ్యకూడదా! పేనుకి పెత్తనమిత్తే తలంతా గొరిగిందంటలే'' వెటకారంగా అన్నాడు. ఇంకా »

తాజ్ మహల్
మీ అందరికీ తెలిసిన తాజ్ మహల్ గురించి కాదు నేనిప్పుడు చెప్పబోయేది `ముంతాజ్, షాజహాన్ అమరప్రేమ, ఎర్రటి సాయంకాపు ఆకాశాన్ని ధిక్కరించే త్లెటి స్వచ్ఛమయిన రెండు మనస్సుకు అభిజ్ఞ, అపూర్వ ప్రేమానురాగాకు అమూల్యమైన ప్రతీక, చరిత్ర చెక్కిలిమీద ఘనీభవించిన అందమైన కన్నీటి చుక్క `యీ తాజ్ మహల్ గురించి కాదు నేనిప్పుడు చెప్పదచుకొన్నది ` ఇంకా »


'ఏస్ రన్నర్'
ఎవరో కుర్రవాడు రన్నింగ్ రేస్ చేస్తున్నవాడిలా పేవ్మంటూ మీద బాణంలాగా 'రివ్వు'న పరుగెత్తిపోతున్నాడు వేగంగా. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపు మేర దాటిపోయాడు. ఇంకా »

దాపుడు కోక
''అయ్యో, నాయనా! నాకోక! దాపుడు కోక!'' పద్దెనిమిదేళ్ళ పల్లెటూరు చెన్నమ్మసీట్లోంచి దిగ్గున లేస్తూ అరిచింది. వుట్టిపాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంతో హొయలు లేవు. వొళ్ళో పైట మరుగున పాలు తాగుతూన్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్ళోంచీ జారిపోతూ కెవ్వుమంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది. ఇంకా »

విగ్రహాలు
ఎదురుచూసిన ముహూర్తం రానే వచ్చింది. తెల్లవారితే విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందనగా ఆ రాత్రికే జరగవలసిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు సుబ్బయ్య విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు. ఐదువేల జనాభాకి మించి వుండని ఆ ఊళ్ళో నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డుకు మధ్యగా ఎత్తుగా, వెడల్పుగా కట్టిన దిమ్మెమీద సుబ్బయ్య విగ్రహం పాతేయబడి వుంది. ఆవిష్కరణకి ముందు సుబ్బయ్య మొహాన్ని ఎవ్వరూ చూడకూడదు కాబట్టి పాడెమీద శవానికి గుడ్డకపట్పి బిగించి కట్టినట్టు సుబ్బయ్య విగ్రహాన్ని కూడా తెల్లటి గుడ్డతో కప్పేశారు. ఊళ్ళో ముఖ్యమైన రోడ్లనిండా రంగురంగుల కాయితాల దండలు వేలాడదీశారు. సుబ్బయ్య విగ్రహం పక్కనే ఎత్తయిన స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇంకా »

వాసంత తుషారం
ఆ చిన్న పల్లెటూళ్ళో ఉదయం పది గంటలప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ముందు ఆగిన ఆర్టీసీ బస్సు నుండి ఇద్దరమ్మాయిలు దిగటం అక్కడున్న వాళ్ళందరి దృష్టిని ఆకర్షించింది. ఆ అమ్మాయిలిద్దరూ ఇరవై రెండూ, ఇరవై మూడు సంవత్సరాల ప్రాయంలో ఉన్నారు. ఇద్దరూ పంజాబీ డ్రస్లు ధరించారు. ఇంకా »

'రెండు శవాలు'
తొలికోడితో లేచి, తన వంగతోటకు నీళ్ళు పట్టుకుని, అలిసిపోయిన శరీరాన్ని నదిలో ముంచాలని, నది వేపు దారి తీస్తూ...దారిలో వున్న పాడుబావిలోకి అనుకోకుండా ఓసారి తొంగిచూసి...వులిక్కిపడి, తల లాక్కుని...మళ్ళీ కళ్ళు అంతవి చేసుకుని చూసి కెవ్వుమన్నాడు రంగయ్య. రంగయ్యకు ఒంటిమీద స్పృహ తప్పినట్టయింది. తను చూసింది నిజమా కలా అనుకున్నాడు. వూపిరీ, పెదవులూ బిగించి మరోసారి బావిలోకి చూడసాగాడు. ఈ సారి అతను పూర్తిగా, స్పష్టంగా చూశాడు-బావినీళ్ళలో తేల్తూ రెండు శవాలు కనిపించినై. రంగయ్యకు వొళ్ళు మరింత చెమటపట్టింది. ఏమిటో మాట్లాడబోయినాడు - గట్టిగా అరవబోయినాడు. ఇంకా »

పిచ్చి దంపతులు
ఇంత మాత్రానికెందుకు ప్రారంభించాలన్నాడు. వెంకయ్యకా ఒక్కమాట శూలం పోటులాగా గుచ్చుకొన్నది. ఆ రాత్రి నిద్రపట్టలేదు. పొలాన్ని అమ్మాలనుకున్నాడు. రుద్రమ్మను పల్కరించాడు. ఆమె బదులాడలేదు. వెంటనే పొలాన్ని అమ్ముతున్నానని నలుగురితో చెప్పాడు. ముందు పోటీలు పడ్డారు కొనడానికి. కానీ యీ మారు ఎటు దిరిగీ అమ్మక తప్పదని నలుగురూ కూడబలుక్కున్నారు. చివరికి పొరుగూరి వారికి అమ్మేద్దామనుకున్నాడు. ఇంకా »

మంచి కథ 'ముంగిస కథ'
అలాంటి పని చెయ్యదు. ఎవరోపిలిచి వేస్తే తింటాడు. అంతే.'' ''నీకు సాక్ష్యమే కావలిసి వస్తే తెస్తాను.'' వాడి పొరుగు నుంచే సాక్ష్యం తెచ్చాడు. గడపలో నున్న కోడిపిల్లల్ని హతమార్చింది మీ బయ్యన్నేనని చెప్పగానే ఇది దొంగసాక్ష్యమని కేకలేశాడు డాక్టరు. ''వీటి ఖరీదు పది రూపాయలు. ఇచ్చేయి.'' ''అనవసరంగా నేనెందుకివ్వాలి? మా బయ్యన్న పీకలు కొరికే వీరుడు కాడు. ఇంకా »

వరద
అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరాన్ని చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు తూర్పు వైకుంఠపురం కొండ. దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు. పటమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది, అద్గదీ అమరావతి! ఇంకా »

గ్యారా కద్దూ బారా కోత్వాల్
ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్ళినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేేరం చేస్తూ వున్నారు. అంతలో మాలీపటేల్ వేంచేసినాడు. ''ఒరేయ్! ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? ఇంకా »