యూనిట్
Flash News
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సమీక్షా సమావేశం

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సమీక్షా సమావేశం
ఎమ్. రవి ప్రకాశ్, ఐ.పి.ఎస్., కమీషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మంగళగిర తేది 18.05.2023 మరియు 19.05.2023 న జోన్-1 & ॥ (శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్. టి. ఆర్., కృష్ణ జిల్లాలు) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అధికారులకి ఈ క్రింది ముఖ్య సూచనలు చేసారు. తేది. 23.05.2023 మరియు 24.05.2023 లలో జోన్ -III మరియు IV జిల్లాల అధికారు సమీక్ష జరుగనుంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ గూర్చి కూడా సమీక్ష చేయనున్నారు.
> నాటు సారాయి, సుంకం చెల్లించని మద్యం అరికట్టడానికి అన్నీ జిల్లాలలో విస్తృత దాడు నిర్వహించాలి.
> పెండింగ్ కేసులులో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టు లో ఛార్జి పీటు ఫైల్ చేయాలి.
> నాటు సారాయి పూర్తి గా నిర్మూలించబడిన గ్రామలలో తిరిగి నేరములు జరగకుండా కట్టుదిట్టం చేసి, నిరంతరం నిఘా నిర్వహించాలి.
> మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా అరికట్టడానికి తగిన చర్యలు చేపట్టాలి. అంతరరాష్ట్ర సరిహద్దుల వద్ద వాహనాల తనిఖీ ముమ్మరం చేయాలి.
> పదే పదే నేరాలకు పాల్పడుతున్న నేరస్తులపై పి. డి. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.
> ఇండస్ట్రియల్ ఆల్కహాల్ వినియోగిస్తున్న పరిశ్రమలను తనిఖీ చేసి, తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా వాటి యాజమాన్యాలకు సూచనలు ఇవ్వాలి... ఎక్సైజ్ నేరాలలో సీజ్ చేయబడిన వాహనాలను త్వరగా జప్తు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.
> నాటు సారాయి తయారీ, గంజాయి సాగు వంటి నేరములకు పాల్పడుతున్న కుటుంబాలును గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. వివిధ శాఖల సమన్వయం తో, నేరాలలో పాల్పడిన వారిని మళ్ళీ పాల్పడకుండా తగిన అవగాహన కల్పించాలి.
> ఎలాంటి లైసెన్సు గాని లేదా అనుమతి లేకుండా మత్తు పదార్దాలు అమ్మే వారిపై తప్పని సరిగా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
> నాటు సారా సుంకం చెల్లించని మద్యం/ మాధక నిరోధక చట్ట క్రింద ముద్దాయిలుగా గుర్తింపు పొందిన వారిపై నేర చరిత్ర పత్రాలను రూపొందించి, వారి పై తగిన నిఘా ఏర్పాటు చేయాలి.
> నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ ఉన్న ముద్దాయిలను, ఆ రాష్ట్ర పోలీసు వారి సాయంతో త్వరితగతిన కోర్టునందు హాజరుపరిచాలి.
> అన్ని కళాశాలలు, విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాల దగ్గర ఉన్న కిరాణా మరియు పాన్ దుకాణములనందు గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలు లేకుండా నిరోధించటానికి తగిన నిఘా చర్యలు తీసుకోవాలి మరియు నేరస్తులపై కేసులు నమోదు చేయవలెను.
> స్పందన ఫిర్యాదుల పై గుణాత్మక పరిష్కారాలు అన్వేషించాలి. సమస్య పరిష్కారం ఫిర్యాదుదారుడి నుండి అభిప్రాయం కోరవలెను.
> మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు, శిక్షలను వివరిస్తూ, అన్నీ కళాశాలలు, విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు మరియు అన్ని ముఖ్య ప్రదేశాల లో 'Drug Free Andhra Pradesh" అనే హోర్డింగులు ఏర్పాటు చేయాలి.
> జుదము / పీకాట/ఆన్లైన్ బెట్టింగ్లు / కోడిపందేలు / మట్కా వంటి గేమింగ్ చట్టం కింద వచ్చే నేరాల పట్ల కఠిన చర్యలు చేపట్టాలి.
> విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం కేసుల లో తొలి సారిగా పట్టుబడితే వారికి తగిన కౌన్సెలింగ్ని వారి తల్లిదండ్రుల సమక్షంలో ఇచ్చి వారు సరైన మార్గము నందు ఉండే లాగా సూచించాలి.
> మద్యం అమ్మకాలలో ఋణాత్మక వృద్ది కలిగిన మద్యం దుకాణములు గల ప్రాంతాలలో, నాటు సారాయి మరియు సుంకం చెల్లించని మద్యం నేరాల పై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని అరికట్టాలి.
>మహిళా పోలీసులు నాటు సారా, గంజాయి, పేకాట వంటి నేరాలకు సంబందించిన సమాచారం సేకరించటలో నిరాటంకంగా పనిచేస్తూ సెబ్ అధికారులకు సహకరించాలి.
> గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణముగా సెబ్ అధికారులు పని చేయాలని, ఎటువంటి నిర్లిప్తత గాని నిర్లక్ష్యం గాని కలిగి ఉండరాదని తెలిపారు.
కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూర
మంగళగిరి .