యూనిట్

'రెండు శవాలు'

తొలికోడితో లేచి, తన వంగతోటకు నీళ్ళు పట్టుకుని, అలిసిపోయిన శరీరాన్ని నదిలో ముంచాలని, నది వేపు దారి తీస్తూ...దారిలో వున్న పాడుబావిలోకి అనుకోకుండా ఓసారి తొంగిచూసి...వులిక్కిపడి, తల లాక్కుని...మళ్ళీ కళ్ళు అంతవి చేసుకుని చూసి కెవ్వుమన్నాడు రంగయ్య. రంగయ్యకు ఒంటిమీద స్పృహ తప్పినట్టయింది. తను చూసింది నిజమా కలా అనుకున్నాడు. వూపిరీ, పెదవులూ బిగించి మరోసారి బావిలోకి చూడసాగాడు. ఈ సారి అతను పూర్తిగా, స్పష్టంగా చూశాడు-బావినీళ్ళలో తేల్తూ రెండు శవాలు కనిపించినై.

రంగయ్యకు వొళ్ళు మరింత చెమటపట్టింది. ఏమిటో మాట్లాడబోయినాడు - గట్టిగా అరవబోయినాడు. పెదవులు తెరుచుకున్నాయి గాని, కంఠంలోంచి స్వరం రాలేదు. రంగయ్య కొయ్యబారిపోయాడు - తమాయించుకుని వెనక్కు వచ్చి అటూ యిటూ చూశాడు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. కొన్ని ఫర్లాంగుల దూరంలో తన వూరు కనిపిస్తున్నది. రంగయ్య ఏమీ తోచని వాడల్లే తనను ఎవరో తరుముతున్నట్టుగా ఊరికేసి పరిగెత్తసాగాడు - రొప్పుకుంటూ!

''కసరత్తు మొదలెట్టావా ఏమిటి రంగయ్యా?'' అని పక్కనుంచి నవ్వుతూ పలకరించాడు కరణంగారి అబ్బాయి వేణు. ఈ పిలుపుతో రంగయ్య తన కాళ్ళకు బంధాలు పడ్డట్టు ఠక్కున ఆగాడు. 

''గోరం చినబాబూ గోరం,'' అన్నాడు రంగయ్య బావికేసి చూపిస్తూ. 

వేణు ఏవిటని ప్రశ్నించేలోగానే రంగయ్య చెప్పసాగాడు.

''పెందలకడ లేసి ఎవళ్ళ మొహం చూశానోగాని- రామరామ...నూతి కాడికెళ్ళి లోపలికి తొంగి సూద్దును- రెండు సెవాలు బాబూ రెండు,'' అన్నాడు తడబడుతూ. 

వేణు ఆగమ్యంలో పడ్డాడు.

'' ఏమిటి రంగయ్యా శవాలా? బావిలోనా?'' అంటూ పరుగెత్తసాగాడు. వెనకాలే రంగయ్య పరుగెత్తాడు. ఇద్దరూ బావిగట్టు మీద నుంచి లోపలికి తొంగిచూశారు. నిశ్చలంగా రెండు శవాలు- ఒకటి మగ, ఒకటి ఆడ- ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ పాడునీళ్ళలో తేల్తున్నాయి!

ఒక్క గంటసేపట్లో, వూరువూరంతా ఆ వార్త పాకిపోయింది. 'వూరవతల వున్న పాడు బావిలో రెండు శవాలు', అన్న వార్తేగాని రెండోమాట వూళ్ళో వినిపించలేదు.

సగం వూరంతా బావి ప్రాంతాలకు వచ్చింది. ఆడవాళ్ళూ మగవాళ్ళూ, ముసలాళ్ళూ అంతా చేరి ఓసారి బావిలోకి తొంగిచూసి, 'రామరామ' అనో, 'నారాయణ' అనో అనుకుంటున్నారు. 

''ఏమి చోద్యమమ్మా,'' అన్నది వెంకమ్మ చుక్కమ్మతో.

''పోయేకాలం కాకపోతేనూ - హయ్యో!'' అని నోరు నొక్కుకున్నది చుక్కమ్మ.

''కలియుగం,'' అన్నాడు నరశింహులు నారాయణతో.

''ఎవడికి పుట్టిన బుద్ది చెప్మా యిది?'' అన్నాడు నారాయణ.

'భార్యాభర్తలిద్దర్నీ గొంతులు నొక్కేసి నూతిలో పారేశాడు. వీడిచేతులు పడిపోనూ, వీడికి చేతులు ఎట్లా వచ్చాయో,' అనుకున్నది సుబ్బమ్మ.

'హత్యలా! ఆత్మహత్యలా!' అనుకున్నాడు వెంకటేశ్వర్లు, డిటెక్టివ్‌ సాహిత్యం తనపై ప్రసరించిన జ్ఞాన కిరణాల వల్ల.

'ఇదోదే భగ్నప్రేమ,' అని వాపోయాడు ప్రణయకథల పాఠకుడు సుబ్బారావు.

'పాడుబావిలో రెండు శవాలు' వార్త, పక్క వూళ్ళకు కూడా పాకింది. ఇసుకవేస్తే రాలనంత జనం పోగైనారు.

అంతటా హడావుడి, కోలాహలం, పెద్దగా గోల, కేకలు!

ఊళ్ళోవున్న అంతమందీ చేరారుగాని- ఆ శవాల ముఖాలు సరిగా తెలియకపోవటం వల్ల ఎవరూ గుర్తుపట్టలేదు. 'ఎవరు చెప్మా ఎవరు చెప్మా!' అనుకున్నారు. ఎవరూ ఏడుస్తూ రాలేదు కాబట్టి, ఈ వూరు వాళ్ళు కాదేమోనని ఎవరో అన్నారు.

'దిక్కులేనివాళ్ళేమో,' అని ఒకడన్నాడు. 'ఆకలి చావులు' అని మరొకడన్నాడు.

మునసబూ, కరణమూ, పోలీసువాళ్ళూ వచ్చారు. జనాన్ని దూరంగా తరిమి అదుపులో పెట్టారు. రెండు శవాల్నీ పైకి తీయించారు. ఒకటి మగవాడు, కుర్రాడే. పాతిక సంవత్సరాలుంటాయి. పాంటు, చొక్కా వున్నాయి. రెండోది ఆడ శవం, చీరె, రవికా, చేతికి ఒకటి రెండు గాజులూ వున్నాయి. వయసు ఇరవై సంవత్సరాలు కూడా వుండవేమో...!

కరణంగారి అబ్బాయి వెంటనే ఆ మగశవాన్ని గుర్తుపట్టాడు - అది ఆనందరావు అనే యువకుడిది. ఆనందరావును కరణంగారి అబ్బాయి వేణు ఎరుగును. ఇంకొకాయన ఎవరో ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు. తన యింటిపక్కన వున్న నాగభూషణం భార్య లక్ష్మి. కొద్దిసేపట్లో ఆ రెండు శవాలూ ఎవరివో వూరంతా తెలిసిపోయింది. 

పోలీసువాళ్ళు ఈ శవాల్ని పంచాయితీకి పంపారు. శవాల శరీరాలపై కత్తిపోట్లుగానీ, మరే విధమైన దెబ్బల గుర్తులుగానీ లేవు. గొంతుపిసికి నూతిలో పారేసినట్లుగా కూడా అనుమానించడానికి లేదు. క్రితం రాత్రి పన్నెండు ఒంటిగంటల మధ్య ఈ మరణాలు జరిగి వుంటాయని, ఆత్మహత్యలు కావచ్చునని నిర్ధారణ చేశారు పంచాయితీ వారు. ఆనందరావు జేబులో వెతికితే అక అథమరకం సిగరెట్టు పెట్టె, ఒక అగ్గిపెట్టె, కొన్ని చిల్లర డబ్బులు దొరికాయి. చీరా, రవికా, గాజులూ తలలో రెండు పువ్వులు మినహా మరేం దొరకలేదు లక్ష్మి దగ్గిర.

ఈ శవాలను వాళ్ళ బంధువులకు వప్పగించాలని పోలీసువాళ్ళు చూశారు. ఏడ్చుకుంటూ ఎవరన్నా వస్తారేమోనని చాలాసేపు నిరీక్షించారు.

ఎంతకూ ఎవరూ రాలేదు. ఆనందరావు విషయమై సబ్‌ఇన్‌స్పెక్టరు వేణును చాలా ప్రశ్నలు వేశాడు.

''ఆనందరావుకు, నాకూ పెద్ద స్నేహం ఏమీలేదు కాని, బాగా తెలుసు. సాధారణంగా పఠనమందిరంలో కలుసుకునేవాళ్ళం. అతను ఒక్కడే ఇక్కడుంటున్నాడు, ఏదో ఆఫీసులో వుద్యోగం చేసుకుంటూ, అతని బసకు నేనెప్పుడూ వెళ్లలేదుగాని - పెద్దరోడ్డుకు అడ్డంగా వుండే రంగనాథం వీధిలో ఒక చిన్నగదిలో వుంటున్నట్టుగా నాతో చెప్పాడు. హోటల్లో భోజనం. వయస్సు పాతిక సంవత్సరాలుంటాయి. మనిషి చాలా మంచివాడు, నవీన భావాలు కలవాడూనూ. సిగరెట్టు జోరుగా కాల్చేవాడు. ఎంతసేపూ పుస్తకాలు చదువుకునేవాడు. ఎంతపిల్చినా పేకాటకుగాని, క్యారమ్స్‌ ఆటకుగాని, మరో ఆటకుగాని వచ్చేవాడుకాదు. తనకు పెళ్ళికాలేదని, తల్లి వున్నదని, ఆమె ఎక్కడో తన అన్నయ్య దగ్గర వుంటున్నదనీ చెప్పాడు. ఇంతకంటే నాకేం తెలీదు,'' అన్నాడు వేణు.

''ఆనందరావు ఎప్పుడూ మీ దగ్గర ఈ అమ్మాయి విషయం ప్రస్తావించలేదా?'' అనడిగాడు ఇన్‌స్పెక్టరు.

''లేదు.''

''తనను పెళ్ళిచేసుకోమని వాళ్ళ అమ్మ ఉత్తరాలు రాస్తే. వాటి మీద ఇతని భావాలు ఎట్టా వుండేవో మీకేమయినా తెలుసా?''

''నేను కూడా పెళ్ళి సంగతి అడిగేవాడిని. నవ్వి వూరుకునేవాడు.''

''పెళ్ళి చేసుకోవాలనిగాని, వొద్దనిగాని ఏమీ అనలేదన్నమాట.''

''ఏమీలేదు.''

''ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా?''

''నాకు తెలీదు. నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు వినడం వల్ల వీళ్ళది ఫలానా వీధి అని అనుకుంటున్నా. ఆ వీధిలో ఒక్కొక్కప్పుడు ఆనందరావు కనిపించేవాడు,'' అన్నాడు వేణు.

''ఆహా!'' అన్నాడు, ఇన్‌స్పెక్టరు. అని, ''ఆ బావిలో శవాలను మొదట చూసింది మీరే కదూ!'' అన్నాడు. 

''కాదు. ముందు రంగయ్య చూశాడు. నాతో చెబితే నేను చూశాను.''

ఇన్‌స్పెక్టరు రంగయ్యను కొన్ని ప్రశ్నలడిగాడు. ఉదయం తను శవాల్ని ఎట్లా చూడటం తటస్థించిందీ, వేణుకు ఎట్లా చూపించినదీ వున్నది వున్నట్లుగా చెప్పాడు రంగయ్య.

పోలీసులు ఆనందరావు గదిని వెతికారు. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఎక్కడా ఏ ఉత్తరమూ రాసిపెట్టబడలేదు. చిన్నగది - గదిలో ఓ చాపా, చిన్న పెట్టే, కొన్ని పుస్తకాలు, కాయితాలూ మినహా చెప్పుకునేందుకు మరేం వస్తువులు లేవు. ఉత్తరాలేవో దొరికాయిగాని - ఈ లక్ష్మి రాసిన ఉత్తరాలేవీ దొరకలేదు. మామూలు విషయాలతో స్నేహితులు రాసినవీ పెళ్ళి విషయమై తల్లి రాసినవీ ఆ వుత్తరాలు.  ఈ విషయం అతని తల్లికి తెలియజెయ్యాలని పోలీసువాళ్ళు ఆమె చిరునామా కోసం ప్రయత్నించారు. లభ్యం కాలేదు. కార్డుపై వూరుపేరు మాత్రం రాసి వున్నది. ఆనందరావు ఆఫీసులో పనిచేస్తున్న అతనితోటి గుమాస్తాలను కూడా వాళ్ళ తల్లి చిరునామా గురించీ, ఇతర విషయాల గురించీ అడిగారు. తల్లి చిరునామా తెలియదన్నారు. ఇతర విషయాలు వేణు చెప్పినట్లే చెప్పారు. తనకో ప్రియురాలు వున్నట్టుగా ఆనందరావు చెబుతూ వుండేవాడనీ, పోతే ఆమె ఎవరయినదీ తను చెప్పేవాడు కాదనీ ఒక మిత్రుడన్నాడు.

లక్ష్మి విషయమై ఆరా తీయగా ఆమె భర్త నాగభూషణం నాలుగు రోజులుగా వూళ్ళోలేడని తేలింది. లక్ష్మి పొరుగింటి సూర్యనారాయణ, అతని భార్యా ఈ విషయం చెప్పారు.

''నాగభూషణం మా యింటి పక్కనే వున్నా అతనితో నాకంత స్నేహంలేదు. అసలు నేనే స్నేహితంగా మెలగనులెండి - అతనిదంతా అదో పద్ధతీ,'' అన్నాడు సూర్యనారాయణ సాగదీస్తూ.

''ఏమిటా పద్ధతి?'' అన్నాడు ఇన్‌స్పెక్టరు.

''అంటే ఏముందీ- మనిషి దగ్గర కలుపుగోరుతనం, మంచితనం ఏంలేదు. ఎప్పుడో ఇంటికి వస్తాడు - భార్యపై ఏదో కేకలు వేస్తాడు, తిడతాడు...''

'అతని వుద్యోగం?''

''ఉద్యోగం ప్రస్తుతం ఏంలేదు. నెలరోజుల నుంచి ఖాళీగానే వుంటున్నట్టున్నాడు. వేళకు వెళ్ళటం రావటం ఏమీలేదు. అంతకుపూర్వం ఏదో మిల్లులో గుమస్తాగా వుండేవాడు.''

''లక్ష్మి ఎట్లాంటి మనిషి?'' అన్నాడు ఇన్‌స్పెక్టరు.

''లక్ష్మి మంచిపిల్లే! 

 

వార్తావాహిని