యూనిట్
Flash News
తాజ్ మహల్

మీ అందరికీ తెలిసిన తాజ్ మహల్ గురించి
కాదు నేనిప్పుడు చెప్పబోయేది `ముంతాజ్, షాజహాన్ అమరప్రేమ, ఎర్రటి సాయంకాపు ఆకాశాన్ని ధిక్కరించే త్లెటి స్వచ్ఛమయిన రెండు మనస్సుకు
అభిజ్ఞ, అపూర్వ ప్రేమానురాగాకు అమూల్యమైన ప్రతీక, చరిత్ర చెక్కిలిమీద ఘనీభవించిన అందమైన కన్నీటి చుక్క `యీ తాజ్ మహల్ గురించి కాదు నేనిప్పుడు చెప్పదచుకొన్నది `
ఆగ్రా ప్రయాణాన్నీ, ఓ వర్షాకాలంలోని 24
గంట అనుభవాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది `
బూడిదరంగు ఆకాశం, పారాతి కట్టడపు ఔన్నత్యం,
యమునానది నిండుతనం కాదు ` ఓ చిన్న పూరి గుడిసె,
ఎర్రకోట ముపులో ఓ మురికిపేటకు వంద గజాల దూరంలో దట్టంగా పెరిగిన
చెట్లూ, నందలాల్, వాడి పొట్టి భార్య,
ఓ కుంటి గుర్రం, ఓ పాత గుర్రబ్బగ్గీ ` ఇవీ గుర్తుకొస్తాయి.
ప్రపంచ అద్భుతాల్ని నవాబు కళాభిరుచితో, ధనంతో ముడిపెట్టక మనస్సు
విశాత్వంతో, ప్రేమ ఔన్నత్వంతో కొలిస్తే నేను చూసిన తాజ్ మహల్ ప్రపంచ అద్భుతాల్లో
ఎనిమిదవది అయితీరుతుంది.
ఇది మరో తాజ్ మహల్ ` దీని గురించే నేనిప్పుడు
చెప్పబోతున్నాను.
....
ఆ రోజు దురదృష్టం వరించిన లోభి హృదయం లాగ
ఆకాశం బ్రద్దలయి ధారాపాతంగా వర్షిస్తోంది. కొత్తగా ఆగ్రాకి రెండు టాక్సీలు
వచ్చాయని, వచ్చినప్పట్నుంచీ నాకు
అర్థం కాని భాషల్లో గైడ్ పోరుతున్నాడు. కాని మేము దిగిన హోటల్ మేనేజరుకి నందలాల్
అంటే సానుభూతిలాగుంది. ముసిలి గుర్రం వెనక బండిమీద చలిలో ముడచుక్కూర్చున్న వాడిని
అతనే మొదట పరిచయం చేశాడు. నవ్వితే పళ్ళు ఎత్తు. నన్ను ఆశగా చూస్తూ వంగి వంగి సలాము
చేశాడు. వీడయితే మీకు కుక్కలాగ సలాము చేస్తాడు. వీడు ఈ వూరికి తాజ్ మహల్ అంత పాతవాడు ` తీసుకుపోండి`’’ అంటూ వచ్చీరాని తొగులో చెప్పాడు
మేనేజర్. వచ్చిన్నప్పట్నుంచీ వీయినంత ఘోరమయిన తెలుగులో మాట్లాడుతూ తాను తెలుగు
వాడినని నాకు హామీ యివ్వబోతున్నాడు. ‘‘నువ్వు కాకపోయినా యీ హోటల్ మారనులే’’ అంటే
పళ్ళన్నీ కనిపించేలాగ నవ్వుతాడు`
నందలాల్ని చూశాను. మాసిన నీలిరంగు తపాగా, నల్లచార కోటు, మణుకు వరకూ ఎత్తికట్టిన పంచె, పల్చటి మీసాలూ,
ఆ రోజు వాడి గుర్రబ్బగ్గీని ఉపయోగించే నా నిర్ణయం మీద జీవితమంతా
ఆధారపడినట్టు ఆశతో చూస్తున్నాడు. ఆ వూరంతా వాడికి కొట్టినపిండి గావును. మంచి నీళ్ళ
ప్రాయంగా స్థలాల పేర్లూ, వాటి ప్రాశస్యం చెప్తున్నాడు.
మాట్లాడుతుంటే చిన్న నత్తి ఉన్నట్టు అనిపించింది. మధ్య మధ్య ఆగుతూ, ఏదో ఆలోచనతో నిలిచిపోయిన ముఖం పెట్టి, నాలిక
సరిచేసుకొని మరోమాట పేరుస్తాడు ` రాజకీయ నాయకుడిలాగ, మనదేశంలో మంత్రి కావసిన అర్హతున్న మనిషి `యిన్ని వంద
మైళ్ళ దూరంలో గుర్రబ్బగ్గీ తోలుకుంటున్నాడని దిగులేసింది.?
ఇదంతా మా ఆవిడ గమనిస్తున్నట్టుందిగావును.
మెల్లగా నా పక్కకి వచ్చి ‘‘పోన్లెండి, వాడినే బండి కట్టుమనండి. నెమ్మదిగా ఊరంతా తిరిగి రావచ్చు’’
అంది. ఆవిడ మాటలు అర్థం కాకపోయినా, ధోరణి అర్థం
చేసుకున్నట్టున్నాడు. ఆమెకి వంగి వంగి సలాము చేస్తున్నాడు. సేవకులకు వరాలిచ్చిన
రాణిలాగ మా ఆవిడ చిరునవ్వు నవ్వుతోంది. ‘సరే,రా’ అన్నాను.
అంతే విన్నాడు. మరి అక్కడ నిబడలేదు. ఏదో పేరు పెట్టి పిుస్తూ ఒక్క అంగలో హోటల్
ద్వారం దాటి పరిగెత్తాడు. పెళపెళలాడే ఎండలో నిర్లక్ష్యంగా నడిచినట్టు వర్షంలోనే
నడుస్తూ పోయి గుర్రాన్ని సిద్ధం చేస్తున్నాడు.
ఉత్తరాదివాళ్ళే చేసిన దక్షిణాది యిడ్లీ
తిని, మా మేనేజరు మంచితనాన్ని
నంచుకొని వసారాలోకి వచ్చి నిలబడేసరికి గుర్రంబ్బండీ సిద్ధంగా ఉంది. ముందు
జీవితానికంతా రక్షణ లభించినంత ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది
నందలాల్ మొహం. ఈ సారి వాడిపక్కనే మరెవరో ఉన్నారు. చూశాను, నల్లగా,
పొట్టి విగ్రహం కనిపించకుండా ముక్కున పెద్ద వెండి ఆభరణం, వర్షంలో కూడా కరిగిపోకుండా నుదుటిన పెద్ద బొట్టు. మేము దగ్గరికి రాగానే
ముఖమంతా చీర లాక్కొని వయ్యారంగా వొంగి వొంగి సలాము చేసింది. నవ్వుతూ ‘మేరీ
బీబీసాబ్’ అని పరిచయం చేశాడు నందలాల్. బండి చుట్టూ దళసరి కేన్వాసు చుట్టాడు. అయినా
ఏదో మూలనుంచి అవాంఛితమయిన జ్ఞాపకం వర్షం లోపలికి తొంగి చూస్తోంది. మధ్య మధ్య
ఖాళీల్లోంచి నేరస్థుడి అంతరంగంలాగ రొజ్జ గాలి కొరుకుతోంది. వర్షంలో స్నానం
చేస్తున్న నందలాల్కీ, వాడి భార్యకీ ఇదే పట్టినట్టు లేదు.
సాయంకాలానికి మేమిచ్చే డబ్బుతో రోజు గడుస్తున్నదన్న వేడి ఆలోచన ఆ చలిలో
వాళ్ళిద్దరినీ బ్రతికించినట్టుంది.
ఒకటి రెండు వీధులు దాటగానే ఇరుకు
సందుల్లోకి వచ్చింది బండి. విజయోత్సాహపు చిహ్నాల్ని మిగిల్చిన ఒక మహాసామ్రాజ్యపు
మహానగరంలో బ్రతుకుతూ జీవితం మీద విజయాన్ని సాధించలేని ప్రజలు వీళ్ళు. ఆగ్రాలో మేం
చూసిన మొదటి దృశ్యమే అది. అక్కడి రాజలు రాజ్యాల్ని జయిస్తే వీళ్ళు జీవితంతో పోరాడి
వీగిపోయారు. బీదరికంలో సంఫీుభావం పెరుగుతుంది గావును. ఆ చలి ఉదయాన్ని అక్కడా
అక్కడా కుంపట్ల చుట్టూ మనుషు కూర్చొని ఆప్యాయంగా పకరించుకొంటున్నారు. విచిత్రం!
ఎక్కడ చూసినా ముసలివాళ్లే ` పాదుషా అధికారం, అజమాయిషీ క్రింద
నలిగిపోయి, వొడిలిపోయిన పాత జ్ఞాపకల్లాగ ఉన్నారు. నవ్వితే
ఖరీదయిన విస్కీ సీసాలో మిగిలిపోయిన చివరి ఘాటువాసనలాగ, ఎప్పుడో
గొప్పగా బ్రతికిన రోజు ఛాయు కనిపిస్తాయి. ఆ ముఖాల్లో వాళ్ళకి ఎటువేపు తాజ్మహల్
ఉందో గుర్తులేదు. ఎర్రకోటలో గబ్బిలాలు ఉన్నాయో, ప్రభుత్వం
ఏర్పరచిన పురావస్తు ప్రదర్శనశాల ఉందో తెలీదు. యమునా నది వేగాన్ని మరిచిపోయి,
గమనాన్ని మార్చుకొన్నదేమో అర్థం కాదు. పాత సంస్కృతికి చిహ్నాలుగా,
ఆ నగరంలోని శిథిల సమాధలు వరసలో చివరగా మిగిలిపోయిన గుర్తు వాళ్లు.
ఆశగా రొట్టొతినే ముసిలివాళ్ళ బృందం ముందు
బగ్గీ ఆపమంటే విరగబడి నవ్వాడు నందలాల్. ‘ఇక్కడేముంది సార్ ` ఇప్పుడేం లేదు ` ఒకప్పుడు పాదుషా కాంలో ` ఈ వీధుల్లో రత్నాలు
అమ్మేవారట`’’ ఇప్పుడక్కడ చాల్కోల్ దుకాణం, చేతికర్ర షాపు కనిపించాయి. ఈ సారి నవ్వడం నావంతయింది. మళ్ళీ బగ్గీ
కదిలింది. వర్షం యీసారి ఎక్కువయింది. ఇంటి రేకు మీద పడి తాగుబోతు ప్రేలాపనలాగ
వినిపిస్తోంది. రాజు తీవ్రతకు తట్టుకొని నిలిచిన ప్రజలుఈ వర్షం తీవ్రతని లక్ష్యం
చేస్తున్నట్టు లేదు.
బండిని ఏదో వంతెన దాటిస్తున్నాడు నందలాల్ ` వంతెన క్రింద ఎర్రటి నీటి
ప్రవాహం ఏమిటని అరిచాను లోప్నుంచి. ‘జమ్నా’ అంది వాడి భార్య. గొంతు నిర్మలంగా,
నిండుగా ఉంది. మా క్రింద పారుతున్న ఎర్రటి నదికూడా అంత నిండుగానూ
ఉంది. కరుణాపూరితమయిన రుషి అంతరంగంలాగ ప్రశాంతంగా ఉంది. ప్రాపంచిక చింతను
వెక్కిరించే స్థితప్రజ్ఞుడి చిరునవ్వులాగ, మీది నుంచి కురిసే
వర్షాన్ని జీర్ణించుకుంటూ నిలిచిన ఎర్రటి నీరు ప్రవాహగమనం అసిన బాలింతరాలి నడకలాగ
ఉంది.
‘‘ఇక్కడి నుంచి తాజ్మహల్
కనిపిస్తుంది సాబ్ ` చూడండి’’ అన్నాడు నందలాల్.
అటు చూశాను. మసకవేసిన ఆకాశం మీద బద్దకంగా, కదలలేని మబ్బుతునకలాగ `
దూరాన ఓ కట్టడం కనిపించింది. అదే తాజ్మహలే అయి ఉంటుందనుకున్నాను.
తరువాత వరసగా చాలా కట్టడాలు చూపించాడు
నందలాల్. ‘ఇత్మదుద్దౌలా’ అనే ఒక్క పేరే యింకా గుర్తుండి పోయింది. వచ్చీ పోయే
యాత్రికుల ఔదార్యం మీద తమ ఉపాధిని ఏర్పరచుకొన్న బీద మహమ్మదీయు దిగులు కళ్లు కూడా
యింకా గుర్తున్నాయి. ఆ తర్వాత దయాల్బాగ్ తీసుకు వెళ్ళిన గుర్తు.
దట్టమైన చెట్ల మధ్య నుంచి గతుకు రోడ్డు
వెంబడే నడిపించి మరో గంటకి ఎర్రకోట దగ్గర ఆపాడు. ఆగ్రా అంటే తాజ్మహలె గుర్తు మా
ఆవిడకి. ఇవన్నీ చాలా విసుగ్గా ఉన్నాయి. అరణ్యమంతా పరుగుతీసి, యింక కాు కదపలేక ఆకలితో,
అసటతో నిలిచిపోయిన ఖడ్గమృగం శరీరంలాగ కనిపించింది ఎర్రకోట. ఆ మసక
మెగులో మరీ దూరానికి ` వర్షం తాకిడికి నలిగిపోయినా కాగితం
పడవలాగ కనిపించింది.
లోప మెట్లెక్కుతూ తనకు తెలిసిన ధోరణిలో
వర్ణించడం ప్రారంభించాడు నందలాల్. వాడిపక్క వినయం, సిగ్గు, చలితో కుంచించుకుపోయిన వాడి
భార్య. అంత చలిలోనూ మా కంటె చురుకుగా అడుగు వేస్తూ ముందుకు వురుకుతున్నాడు. వాడిని
చూస్తూంటే చరిత్ర చేతుల్లో నలిగిపోయిన మొగలాయి సంస్కృతికీ, జీవితం
చేతుల్లో నలిగిపోయిన నందలాల్కీ తేడా లేదనిపించింది. గదినుంచి గదికి తిప్పుతూ
చివరికి పాదుషా శయనాగారాన్ని చూపించాడు నందలాల్. రాజవంశాన్ని దీవించే పెద్ద
ముత్తయిదువలాగ అక్కడికి యమునానది కిటికీలోంచి కనిపిస్తోంది. ఈ గదిలోనే పాదుషా
ముందు చరిత్రకి నాంది జరిగింది.
ఇక్కడే పాదుషా విలాసాకు బీద ప్రజ చరిత్రు
శిథిమయిపోయాయి. ఈ గదిలో గడిచిన ఒక అమృతక్షణంలోనే ముంతాజ్ ఒక ప్రపంచ అద్భుత
నిర్మాణానికి భర్త దగ్గరనుంచి వరాన్ని పుచ్చుకొంది. ఇన్ని శతాబ్దా తర్వాత ఒక బీద
గుర్రబ్బగ్గీ వాడూ, ఒక సామాన్య రచయితా తమ ఆలోచనల్ని యిక్కడ పంచుకొనే అదృష్టం
భించింది. మళ్ళీ యీ క్షణం రాదు. అందుకని నందాలాల్ అటు తిరగ్గానే మా ఆవిడని
ఒక్కసారి చేతోల్లోకి తీసుకుని మద్దు పెట్టుకున్నాను. త్లెబోయి ఆశ్చర్యంగా చూస్తే,
‘‘ముంతాజ్ షాజహాన్ అమర ప్రేమకు పునాది యీ గదిలోనే పడిరది. ఆ ప్రేమకి
మన శ్రద్ధాంజలి యిది ` నడువు’’ అన్నాను. ఆవిడ ఒకటే నవ్వు.
ఎర్రకోటనుంచి తాజ్మహల్ స్పష్టంగా
కనిపిస్తోంది. షాజహాన్ వృద్ధాప్యంలో కొడుకు అతణ్ణి బంధించిన గదిలోంచి యింకా
విచిత్రంగా కనిపిస్తోంది.
కొడుకు అలా బంధించకపోతే యమునకి అవతలి
ఒడ్డున న్లటి పారాతితో మరొక తాజ్మహల్ వెలిసేదని నందలాల్ వివరిస్తున్నాడు. నాకు
మాత్రం ఆ ప్రమాదం జరగనందుకు ఎంతో సంతోషం కలిగింది. తండ్రి ప్రయత్నాన్ని మధ్యలోనే
ఆపివేసిన కొడుకు అభిరుచిని మనస్సులోనే అభినందించాను. మహాద్భుతనిర్మాణం ప్రక్క
అలాంటి నిర్మాణాన్నే చేయబూనడం దానిని అవమానించినట్టే అవుతుంది. అప్పుడే విరిసిన
గులాబిపువ్వు పక్క మరొకటి లేనప్పుడే దాని గొప్పతనం. పునరుక్తి నవ్యతను
చంపేస్తుంది. మేర్లిన్ మన్రో పక్క అలాంటి మరొక అందకత్తెను నిలిపితే అందానికి
అన్యాయం చేసినట్టే. ప్రపంచంలో ఒకే ఒక తాజ్మహల్ ఉండాలి ` దానికి సాటి మరొకటి
ఉండకూడదు ` అన్న ఉద్దేశమే ఔరంగజేబు చర్యకు కారణమై ఉంటుంది.
మళ్ళీ గుర్రబ్బగ్గీలో ప్రయాణం సాగించాం.
మేం ఎదురు చూస్తున్న క్షణం వేపు గుర్రం పరిగెత్తుతోంది. మా ఆవిడకి ఒకటే ఆత్రుత.
అప్పటికి అపరాహ్నం దాటింది.
తాజ్మహల్ ప్రాంతంలోకి బండీని తీసుకువచ్చి
ఆపాడు. హోరున వర్షం. ఎదురుగా పది గజాల్లో ఉన్న వస్తువుకీ మాకు మధ్య బూడిదరంగుతెర
జారినట్టు ధారుగా కురుస్తోంది.
‘‘ముపు తిరిగితే తాజ్మహల్
కనిపిస్తుంది సాబ్. ముందుకు బండి పోనివ్వరు. అక్కడ గైడ్స్ ఉంటారు. చూసిరండి. మేం
భోజనం చేసి సిద్ధంగా ఉంటా’’ అన్నాడు నందలాల్ వాడ భాషలో.
సరిగ్గా ఆ క్షణంలో అందరూ ఆకలిని మరిచి
ముందుకు సాగితే, నందలాల్కి యిప్పుడు ఆకలీ,
విశ్రాంతీ గుర్తుకొచ్చాయి. మనకి ప్రపంచంలో కల్లా అద్భుతదృశ్యం
వాడికి దైనందిన గమ్యస్థానం. మనకి వినోదయాత్ర, వాడికి
జీవనాధారం. తాజ్మహల్ వాడి జీవితంలో ఒక భాగం, చరిత్ర వాడికి
ఉపాధి.
అటువేపు చూసే ఉత్సాహం కూడా చూపలేదు
నందలాల్. నేను బండి దిగగానే రొట్టెమూట తీసి బండిలో పరుచుకొని వాడూ, భార్యా ఆప్యాయంగా తినడం
ప్రారంభించారు.
ఆక్షణంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి
మేము వర్షంలో ముద్దయిపోయాం. అన్ని దేశా వారూ, అన్ని రాష్ట్రావారూ అక్కడ కనిపిస్తున్నారు. ఒక అపూర్వమయిన
అనుభవాన్ని పొందాక ఏర్పడే నిర్లిప్తత, నిశ్శబ్దం ` వారి కళ్ళలో ద్యోతకమవుతోంది. అన్ని మతాూ, అన్ని భావా
సామరస్యం కళాసృష్టిలోనే సాధ్యమవుతుందిగావును. క్రైస్తవునికీ, మహమ్మదీయునికీ భూపారాగం ఒకే విధంగా వినిపిస్తుంది. పికాసో చిత్రం, ఠాగూర్ గీతాంజలీ ఒకే విధమయిన భావప్రేరణను కలిగిస్తుంది.
నాకంటే మా ఆవిడ తొందరగా అడుగు వేస్తోంది.
తిరగవసిన ముపు తిరిగాం. మనస్సూ కళ్ళూ ఒక అన్యోన్యమయిన ఆనందానికి సిద్ధపడుతున్నాయి.
కాని యిదేమిటి! ` వర్షపు ధార వెనక ఒక జేగురు రంగు కట్టడం కనిపిస్తోంది.
పాతజ్ఞానం సాక్ష్యంతో దాన్ని తాజ్మహల్గా ప్చోుకున్నాను. వెలిసిపోయిన జ్ఞాపకంలాగ,
నిర్లక్ష్యానికి గురి అయిన సంస్కృతీ చిహ్నంలాగ ఒంటరిగ కనిపించింది.
ఆ క్షణంలో ఎవరేనా దగ్గరికి వచ్చి ‘‘ఇది తాజ్మహల్ కాదు’’ అని చెవిలో అరిస్తే
బాగుణ్ననిపించింది.
‘‘న్లనివాడు పద్మనయనంబు అని చదువుకొని, మనస్సులో మహోన్నత
స్వరూపాన్ని ఊహించుకొన్నాక సినిమాలో లోతుకళ్ల నీలిరంగు కృష్ణుడిని చూసినట్టు నా
ఊహలో తాజ్కీ, దీనికీ పోలికలేదు! ` ఊహ
ఎంతమోసం చేస్తుంది! కళ కంటే కళాహృదయం ఎంత ఉన్నతమయినది!` సుగుణ
రూపి అయిన కళకి పెరుగుద లేదు ` నిర్గుణాత్మకమయిన కళా
హృదయానికి అవధిలేదు. ఊహలోని తాజ్మహల్ ఈ వాస్తవికత ముందు కూలి శిథిమయిపోతోంది. గోడు
కూలిపోతున్నాయి. ఎదురుగ్గా వున్న తాజ్మహల్ నిర్మించినప్పటినుంచీ శిథిమవుతోంది. నా
మనస్సులోని తాజ్మహల్ నా ఊహ అంత విశాంగా, ఉన్నతంగా దినదిన
ప్రవర్థమానమవుతోంది.
మా ఆవిడ మాత్రం నోరు చప్పరిస్తూ ‘‘ఆహా!
ఎంత బాగుంది’’ అంటోంది. ఊహకు వాస్తవికతూ రాజీ కుదుర్చుకొన్న అదృష్టవంతురాలామె.
అక్కడున్న అందరి అదృష్టవంతు మధ్య నా దురదృష్టాన్ని ప్రకటించుకోవడం యిష్టంలేక, నిశ్శబ్దంగా తాజ్మహల్ని
సందర్శించి వచ్చాను.
నందలాల్ సుష్టుగా భోజనం చేసి మేం
వచ్చేసరికి ఒక నిద్రకూడా తీశాడు. వాడి భార్య తాంబూం వేసుకొంటూ మమ్మల్ని చూసి
వాడిని లేపింది. గుర్రాన్ని రaుళిపిస్తూ ‘‘ఏం సాబ్, ఎలా ఉంది?’’
అన్నాడు.
జీవితంలో అన్ని కర్మనూ ముగించుకొని
సన్యాసాన్ని స్వీకరించిన యోగి, సంసారసాగరంలో త మునకయిన వాడిని వేసిన ప్రశ్నలాగ
వినిపించిందా ప్రశ్న. నేనేం సమాధానం చెప్తేనేం? బాగులేదన్నా
చిరునవ్వు నవ్వి మమ్మల్ని క్షమించేంత నిబ్బరంగా ఉన్నాడు. భోజనం తర్వాత మళ్ళీ
నందలాల్ హుషారు పుంజుకొన్నాడు. ఇంకా ఏవేవో స్థలాు చూపించాడు. కాని నాకు మాత్రం ఆ
తర్వాత ఉత్సాహం చచ్చిపోయింది.
బేరం చేసినదానికంటే ఎక్కువే ఇచ్చాను
వాడికి. వాడూ, వాడికంటే భార్యా
సాష్టాంగపడిపోయారు. బీదవాడి సంతోషం ఎంత చవుక! కాని, ఎంత
గొప్ప! వాళ్ల కృతజ్ఞతకి మా ఆవిడ కళ్ళనీళ్ళే వచ్చాయి. భాషరాదు కాని లేకపోతే వాడి
భార్యకి మంచి నేస్తం అయేది. ఆ తర్వాత ఎన్నో వారాపాటు నందలాల్నీ, వాడి పొట్టి భార్యనీ గుర్తుచేసుకొంటూనే ఉంది.
....
మళ్ళీ పదేళ్ళ తర్వాత ఢల్లీ ప్రయాణం
పడిరది. ఆఫీసులో నుగురిని ఢల్లీలో ట్రయినింగుకి పంపారు. అప్పుడు మళ్లీ ఆగ్రా
వెళ్ళాని మిత్రుంతా తీర్మానించారు. కాని, ఆ వర్షంలో మసకబారిన కట్టడం, ఎర్రకోట `
వీటి జ్ఞాపకా, అప్పుడు ఏర్పడిన అభిప్రాయాు
ఇంకా చెరిగిపోలేదు. అందుకని ఆగ్రాకి మాత్రం రానన్నాను. కాని మిత్రు మాత్రం
వదల్లేదు. ‘‘నువ్వొకసారి వెళ్ళావు కనక మాకు సుళువు.
పద’’ అన్నారు. ఊహని చెరిపేసుకోవాన్న
తాపత్రయం, వాస్తవాన్ని చూసిన ఆనందం
కన్న గొప్పదనుకుంటాను. కాని తాజ్ మహల్ చూశాక ఊహని ఊహా ప్రపంచంలోనే నివనిస్తేనే
అపూర్వమయిన ఆనందం ఉన్నదని నిశ్చయానికి వచ్చాను. ఈ సూత్రం ప్రకారం చార్లీచాప్లీన్తో
మాట్లాడడం, గ్రేటా గార్బోను ముద్దుపెట్టుకోవడం, న్యూయార్కు వీధి బార్లో నీగ్రో సంగీతం వినడం నేను చేస్తే చేయను ` అవి నాకు అత్యంత ప్రియతమమైనవి కనక.
మొత్తం మీద ఆగ్రా వచ్చాం. అదే మద్రాసీ
హోటల్లో దిగాం. అదే మేనేజరు హోటల్లో ఉన్నాం. చరిత్రమారడానికి 10 ఏళ్లు చిన్న వ్యవధి `
కాని జ్ఞాపకం మాయడానికి పదేళ్ళు పెద్ద అవధి. నేను గుర్తు
చెయ్యకుండానే పోలిక పట్టగలిగినవాడు. ఒక్కడే నందలాల్! ` నన్ను
చూడగానే హోటల్ ఆవరణలోకి పరిగెత్తుకు వచ్చాడు. మొహం ఇంతయ్యింది. పదేళ్ళువాడిని చాలా
మార్చాయి. జుత్తు నెరిసింది. ఒళ్ళు బాగా వచ్చింది. మీసాు తీసేశాడు. కనుబొమ్ము
దుబ్బుల్లాగా పెరిగాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తాగుడు ఎక్కువ అవాటు చేసుకున్నాడు
గావును. కాని గొంతులో సౌమ్యత పోలేదు.
లేక నామీద గౌరవమేమో అది. ‘‘మేమ్సాబ్
రాలేదా సాబ్’’ అన్నాడు. వాడి ముసిలి గుర్రం అక్కడికి కనిపిస్తోంది. మా మిత్రుకి
చెప్పాను. వీడయితే మనకన్నీ తీరికగా చూపుతాడని. కాని అప్పటికి టాక్సీు ప్రబంగా
ఉన్నాయి. మంచి ఇంగ్లీషు వచ్చిన గైడ్ని తీసుకుని కారులో పోదాం అన్నారు. వాళ్ళ
సంస్కారానికి నందలాల్ మురికి బండి, వాడి భాష అడ్డొచ్చాయి. ‘‘వద్దంటున్నారు నందలాల్’’ అన్నాను.
‘‘పర్వానై సాబ్. సాయంకాం తమ దర్శనానికి వస్తాను. ఒక అరగంట నాతో రండి’’ అన్నాడు.
మేం వద్దన్నామని విచారం లేదు. పదేళ్ళ క్రిందటయితే దిగు కనిపించేది.
ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడు. వయస్సు
జీవితంపట్ల పిరికితనాన్ని చంపేసి ఒక వేదాంతాన్ని మిగిల్చింది. ఇప్పుడే నిండుగా
ఉన్నాడు నందలాల్. ఈసారి ఎండ మెగులో తాజ్మహల్ కాస్త మెరుగుగా కనిపించింది. అప్పట్లో
కళాసృష్టిని సానుభూతితో అంగీకరించానే కాని ఆప్యాయతతో అనుభవంలో పొదుగుకోలేదు.
సాయంకాం తిరిగి వచ్చేసరికి నందలాల్
సిద్ధంగా ఉన్నాడు. వేడికాఫీ తాగి వాడి గుర్రబ్బగ్గీలో బయుదేరాను. ఇప్పుడు వాడి భాష
బాగా అర్థమవుతోంది.
ఉన్నట్టుండి అడిగాను: ‘‘నీ భార్య
కనపించదేం?’’ అంటూ, అంతే! కళ్ళనీరు కార్చడం ప్రారంభించాడు వాడు. ఆ కథంతా చెప్పుకొచ్చాడు.
మూడేళ్ల కిందట పోయిందట. అప్పటినుంచీ ఒంటరిగానే బండి నడుపుకొంటున్నాడట. జాలేసింది
నాకు. ఆ దంపతు సమష్టి జీవనం చూసిన నాకు, ఇప్పటి నందలాల్
ఒంటరి జీవితంలో అసమగ్రత కొట్టొచ్చినట్టు కనిపించింది. శిథిమయిన పాదుషా గోరీ
మీదనుంచి కూడా ధైర్యంగా పయనిస్తున్న మొగలాయీ సంస్కృతీ చరిత్ర, ఇవాళ సజీవ శైథిల్యాన్ని అనుభవిస్తున్న నందలాల్ దగ్గరికొచ్చి ఆగిపోయింది.
ఆగ్రా ప్రాచీన సంస్కృతీ చైతన్యంలో నందలాల్ ఒక భాగమయితే, ఇవాళ
ఆ చైతన్యం స్తంభించి పోయినట్టే కదా!
‘‘ఎక్కడికి యిలా!’’
అన్నాను. ‘‘చెప్తాను సాబ్’’ అంటున్నాడు. అంత దు:ఖంలోనూ వాడిని పకరించి, వాడి కష్టాను పరామర్శించిన నా సమక్షం కొంత మనశ్శాంతిని కలిగించడం
కనిపెట్టాను. గుర్రబ్బగ్గీ ఎర్రకోట ముపు తిరిగి, ఓ నూరు గజాు
దాటి దట్టంగా పెరిగిన చెట్ల మధ్యకి వచ్చి ఆగింది. సంధ్య మెగు అక్కడికి జారడం లేదు.
కాగమనంతో ప్రమేయంలేని ఒక నిశ్శబ్దం ఆ ప్రాంత మంతటా ఆవరించి ఉంది. మరో పదిగజాు
నడిపించి ఒక చోట ఆపాడు.
చుట్టూ శుభ్రం చేసి మధ్యలో తుసికోటలాంటి
కట్టడం ఉంది. దానికి ఎర్రరంగు పూశాడు. నిన్నటి పువ్వు ఎండి గాలికి
రెపరెపలాడుతున్నాయి. చుట్టూ బంతి పువ్వు మొక్కు పాతి ఉన్నాయి. అతి భక్తితో, వినయంతో అక్కడ ముణుకు మీద
కూర్చొని తవొంచాడు.
‘‘ఇక్కడే సాబ్ నా భార్య
పోయింది. మూడేళ్లయింది. నేనీ గుడిసెలోనే ఉంటున్నాను’’ అంటూ పక్కనున్న గుడిసె
చూపించాడు.
దీనంగా ఆర్ద్రంగా ఆ కట్టడం వేపు
చూస్తున్నాడు నందాలాల్. విధి విధించిన శాపాన్ని నిశ్శబ్దంగా స్వీకరించి, ఆ ఒంటరితనాన్ని భార్యపట్ల
కృతజ్ఞతతో నింపుకొన్నాడు. అప్పటి వాళ్ళ ఆప్యాయత, అన్యోన్యత,
పొట్టి భార్య త్లెటి చిరునవ్వు, ఇద్దరూ కలిసి
కష్టాన్ని పంచుకొనే ఒద్దిక ` అన్నీ గుర్తుకొచ్చాయి.
ప్రపంచమంతా దీనిని గుర్తించకపోయినా వాడికి
అవసరం లేదు. వాడూ, వాడికి నచ్చిన ఆప్తుూ తొసుకుంటే చాు. వాళ్ళ జ్ఞాపకాలో
ఆమెకు అమరత్వం సిద్ధింపచేశాడు. దూరంగా కనిపించే ఉన్నతమయిన కట్టడంలో భార్యపట్ల
ప్రేమానురాగాతోపాటు, ధనం భింపచేసిన ఠీవీ, దర్పం ఉన్నాయి. ఇక్కడ నిర్మితమయిన ఈ చిన్నకట్టడంలోనూ అంత ఔన్నత్యమూ ఉంది.
అంతకు మించిన ప్రేమానురాగాున్నాయి. కాని వాటితోపాటు బీదరికం యిచ్చిన నిరాడంబరత,
విశ్రాంతీ ఉన్నాయి.
అక్కడ విశ్రమించే ప్రేమమూర్తి నుగురి
మధ్యా అనునిత్యం గుర్తింపబడే అదృష్టవంతురాయితే యిక్కడ విశ్రమించిన నందలాల్ పొట్టిభార్య
నుగురి ప్రమేయంలేని ప్రశాంత సుషుప్తి ననుభవిస్తున్న అదృష్టవంతురాు. భార్యతో
సుఖాన్ని, భార్యలేని దు:ఖాన్ని తనకే
మిగ్చుకొన్న అదృష్టవంతుడు నందలాల్. అ్లంత దూరంలో కనిపించేది ప్రపంచమంతా విస్మయంతో
చూసే తాజ్మహల్ అయితే, ఇది ఒక గుర్రపుబగ్గీవాడి హృదయాన్ని
ఆర్త్రం చేసే తాజ్మహల్.
అప్పటి జ్ఞాపకాు పునశ్చరణ చేసుకుంటున్నాడు
గావును ` ఇంకా అటువేపే నిశ్చంగా
చూస్తున్నాడు. తెలియకుండా నాకూ కళ్ళవెంట నీళ్లొచ్చాయి.
‘‘ఇక వెడదామా?’’ అన్నాను.
‘‘నాకోసం ఇంత దూరం వచ్చారు
సాబ్. నాకదే పదిమే’’ అని కాళ్ళు పట్టుకున్నాడు. తిరిగి వస్తూ అనుకున్నాను `
ఈసారి నిజమైన తాజ్మహల్ని చూశానని ` ఈ ఆగ్రా
ప్రయాణంలో సార్థకత ఉన్నదనీ.
కీ.శే. గ్లొపూడి
మారుతీరావు
(14 ఏప్రిల్ 1939 -
12 డిసెంబర్ 2019)
గ్లొపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి
తొగునాట ప్రసిద్ధు. రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, తొగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి
చేశారు.
రేడియో ప్రయోక్తగా, అసిస్టెంట్ స్టేషన్
డైరెక్టర్గా, ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంపాదకుడిగా సంపాదకవర్గ
సభ్యుగా పనిచేశారు. చనచిత్ర కథ, సంభాషణ రచయితగా నంది
పురస్కారాను స్వీకరించారు.
1999లో షష్టిపూర్తి
సందర్భంగా డా.వేదగిరి రాంబాబు సంపాదకత్వంలో గ్లొపూడి సమగ్ర సాహిత్యం మెవడిరది.
గ్లొపూడి మారుతీరావు తొగు కథానికలో
విశిష్టమైన, విక్షణమైన వాటిని
ఎంచుకొని వ్యాఖ్యానించారు, విశ్లేషించారు. ఓ సంకనంగా
ప్రచురించారు. తొగు కథానికా సాహిత్యానికి గ్లొపూడి అందించిన మివైన కానుక ఆ గ్రంథం.
‘తాజ్మహల్’ కథానికలో
మారుతీరావు దృష్టికోణంలో ప్రత్యేకత కనిపిస్తుంది. మానవీయ దృక్కోణం ద్యోతకమవుతుంది.
పాఠకుడ్ని ఆర్ద్రతకు గురిచేస్తుంది.
శ్రీ గ్లొపూడి మారుతీరావుకు జోహార్లు