యూనిట్
Flash News
అనంతపురం లో పురాతన ఆభరణాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

అనంతపురం జిల్లాలో తక్కువ ధరలకు పురాతన కాలంనాటి బంగారు ఆభరణాలు ఇస్తామని నమ్మ బలికి మోసాలకు పాల్పడిన ముగ్గురు మోసగాళ్ల ను సీసీఎస్, గోరంట్ల పోలీసులు సంయు క్తంగా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ బి. సత్యఏసుబాబు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో అయన కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలోని పెమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మణి, యలహంకకు చెందిన మోహన్, మైసూ ర్కు చెందిన వీరు నిందితులు. వీరిలో ప్రధాన నిం దితుడైన మణి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. గిట్టుబాటు లేకపోవడంతో వివిధ ప్రాంతా లలో నెలల తరబడి ఉండి అక్కడే గుడారాలు వేసుకుని ప్లాస్టిక్ పూల వ్యాపారం చేసి వచ్చిన సొమ్ముతో జీవించే వాడు. మిగిలిన ఇద్దరు నిందితులను కలుపు కుని నకిలీ బంగారం అంటగట్టే మోసాలకు తెరలేపాడు. ఈ క్రమంలో రెండు నకిలీ బంగారు నగలను కొనుగోలు చేసి వాటికి బంగారు పూత పూయించి బాగేపల్లి సమీపం లోని పులగల్లు గ్రామం సమీపంలో ఉండగా.. చిలమత్తూరు మండలం శెట్టిపల్లికి చెందిన మంజునాథరెడ్డితో పరిచయం ఏర్పడటంతో అతడిని మాయమాటతో నమ్మించారు. కొన్ని రోజుల తరువాత ఫోన్లో ఇంటి నిర్మాణం కోసం డబ్బు అవసరం ఉందని నమ్మించడంతో పాటు తన వద్ద పురాతన బంగారం ఉందని నమ్మబలికి గత ఏడాది డిసెంబరు 18 వ తేదీన గోరంట్ల కు ఆ బంగారు హారం తీసుకువస్తానని డబ్బు సిద్ధం చేసుకోవాలని సూ చించాడు. మాయ మాటలను నమ్మిన మంజు నాథరెడ్డి అనుకున్న ప్రకారం అక్కడికి రాగానే ప్రధాన నిందితుడు మణి ఎలాంటి అ నుమానం రాకుండా ముందుగా మంజునాథ్రెడ్డికి రెండు ఒరిజనల్ బంగారు గుండ్లు ఇచ్చి పరిశీలించుకోమని చెప్పాడు. అవి ఒరిజనల్ అని తేలడంతో మొత్తం హారమంతా అసలైన బంగారమని భావించి మంజునాథరెడ్డి వెంటనే రూ.8లక్షలు చెల్లించి ఆ హారాన్ని తీసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి మణి పరారయ్యాడు. కొంత సేపటికి హారం నకిలీదని తేలడంతో బాధితుడు గోరంట్ల పోలీసులను ఆశ్రయించాడు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురు నిందితులపై సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, ధర్మ వరం డీఎస్పీ రమాకాంత్, సీఐ జయనాయక్, ఎస్ఐ చలపతి, హెడ్కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, భాస్కర్, కాని స్టేబు ళ్లు ఫరూక్, అనిల్, మల్లి, శ్రీనివాసులు బృందాలు గా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. గోరంట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని కోరేవాండ్లపల్లి చెక్పోస్టు వద్ద సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రూ. 3లక్షలు నగ దు, రెండు నకిలీ బంగారు హారాలను స్వాధీనం చేసుకు న్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.