యూనిట్

విధి నిర్వహణలో అమరుడైన ఎస్‌.ఐ. కుటుంబానికి ప్రభుత్వ సహాయం

గోదావరి పుష్కరాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఎస్‌.ఐ. శంకర్‌రావు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు 10 లక్షల తక్షణ ఆర్థికసాయం ప్రకటించి మృతుని కుటుంబానికి వెంటనే అందజేయాలని సూచించారు. స్థానిక మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, అర్బన్‌ ఎస్‌.పి.   త్రిపాఠి ఇద్దరూ మృతుని కుటుంబాన్ని కలిసి చనిపోయిన ఎస్‌.ఐ. చిత్రపటానికి నివాళులు అర్పించి, ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

వార్తావాహిని