యూనిట్
Flash News
విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డ్ కుటుంబ సభ్యులకు చేయూతనిచ్చిన సిబ్బంది

తిరుపతి జిల్లా ఎస్పీ
పీ. పరమేశ్వర రెడ్డి చొరవతో జిల్లా
నందు గతంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డ్స్ ల వారి కుటుంబ సభ్యులకు
ఒక్కరోజు వేతనాన్ని ఆర్ధిక సహాయంగా అందించి, తమ ఉధార స్వభావాన్ని
చాటుకున్నారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో జిల్లాలో విధులు
నిర్వహిస్తున్న హోంగార్డులందరూ ఒక్క రోజు వేతనాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా
ఎస్పీ మాట్లాడుతూ, మంచి
మనసుతో మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన హోంగార్డ్స్ అందరికీ కృతజ్ఞతలు
తెలుపుకున్నారు. తన నుండి ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని, నా పరిధిలో ఉన్న ఎటువంటి సహాయమైనా హోంగార్డ్ సంక్షేమంలో భాగంగా తప్పకుండా
అందిస్తానని అన్నారు. అకాల మరణం చెందిన ఐదు మంది హోంగార్డుల కుటుంబాలలో ముగ్గురికి
ఇప్పటికే కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రకారం హోంగార్డు ఉద్యోగాన్ని ఇవ్వడం
జరిగిందన్నారు. మిగిలిన ఇద్దరి కుటుంబ సభ్యులకు కూడా సాంకేతికపరమైన సమస్యలను
పరిష్కరించి, త్వరితగతిన వారికి కూడా న్యాయం
చేస్తానన్నారు.
ఇటీవల
కాలంలో విధినిర్వహణలో చనిపోయినటువంటి ఐదు మంది హోంగార్డుల కుటుంబ సభ్యులైన పి.మంజుల వారి కుమార్తె విష్ణుప్రియ, బి.సత్యం సతీమణి మాలతి, యస్.విజయ్ కుమార్ సతీమణి వరలక్ష్మి, గోవింద రెడ్డి సతీమణి నిర్మల, మురగేషణ్ తల్లి నాగరత్నమ్మ వారికి ఒక్కొక్కరికి రూ. 5,00,000/-
చొప్పున మొత్తం రూ. 25,00,000/- చెక్కులనును తిరుపతి
జిల్లా ఎస్పీ గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో
అందజేసారు. కార్యక్రమంలో అడిషనల్ యస్.పి
అడ్మిన్ వెంకట్రావు, హోంగార్డ్ డి.యస్.పి డి.లక్ష్మణ్ కుమార్,
ఏ.ఆర్ డి.యస్.పి చంద్ర శేఖర్, హోంగార్డ్స్
ఆర్.ఐ శ్రీనివాసులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.