యూనిట్

ఆసుపత్రిలో చేరిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

పోలీసుశాఖ సిబ్బంది కష్టసుఖాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తక్షణం స్పందిస్తున్నారు రాష్ట్ర డి.జి.పి శ్రీ జె.వి.రాముడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌   ఎం.రాజులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని జి.ఎస్‌.ఆర్‌.హాస్పిటల్‌కు తరలించారు. విషయాన్ని రాష్ట్ర డిజిపి శ్రీ జె.వి రాముడు దృష్టికి తీసుకెళ్ళగా తక్షణం స్పందించి చికిత్స నిమిత్తం రూ.5,05,000/-ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. చెక్కును జిల్లా ఎస్‌.పి.   భాస్కర్‌ భూషణ్‌ తన కార్యాలయంలో కానిస్టేబుల్‌ సతీమణి శ్రీమతి ఎం.నాగదుర్గకు చెక్కును అందజేస్తూ నాగరాజు త్వరగా కోలుకుంటాడని ఆమెకు ధైర్యం చెప్పారు.

వార్తావాహిని