యూనిట్

పోలీసు బలగాలకు కొత్త బీమా సదుపాయం

        (పోలీసు సంక్షేమ విభాగం)

        దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులకు వారాంతపు సెలవు ప్రకటించడంతో రాష్ట్రంలోని 64 వేల మంది పోలీసు సిబ్బంది జీవితాలకు కొత్త వెలుగు వచ్చింది. ముఖ్యమంత్రి స్ఫూర్తితో రాష్ట్రంలోని పోలీసుల సంక్షేమం కోసం, వారి జీవితాలను, పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పోలీసు శాఖ పలు చర్యలు చేపడుతోంది.

        యాక్సిస్‌ బ్యాంకుతో ఒప్పందం

        పోలీసు సంస్మరణ దినం 2019 సందర్భంగా రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారి చొరవతో ఏపీ పోలీసు, ఏపీ హోంగార్డు విభాగాలు యాక్సిస్‌ బ్యాంకుతో రెండు చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటివల్ల పోలీసులు, హోంగార్డుల కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుంది. ఈ ఒప్పందం ప్రకారం, కేవలం తమ నెలవారీ జీతాలు/పారితోషికాలను యాక్సిస్‌ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూసుకుంటే పోలీసులు, హోంగార్డులు పలు ప్రయోజనాలు పొందుతారు.

        స్కీమ్‌ వివరాలు ఇలా ఉన్నాయి

  •             జీరో బ్యాలెన్స్‌ సదుపాయంతో అప్పటికప్పుడే ఖాతా అపరిమిత నగదు ఉపసంహరణ సదుపాయంతో ఉచిత ఏటీఎం/డెబిట్‌ కార్డులు (యాక్సిస్‌, ఇతర బ్యాంకు ఏటీఎంలలో)
  •               ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా (రోడ్డు ప్రమాదాలు / ఉగ్రవాద / నక్సల్‌ / మూక దాడులతో సహా) రూ. 30 లక్షలు; శాశ్వత వైకల్య బీమా కవరేజి రూ. 30 లక్షలు (పీవోఎస్‌ యాక్టివేషన్‌ లేకుండా). ఉగ్రవాద దాడుల్లో మరణానికి రూ. 30 లక్షల బీమా కవరేజికి, అదనంగా వ్యక్తిగత ప్రమాద బీమా రూ. 10 లక్షలు, మొత్తం 40 లక్షలు (పీవోఎస్‌ యాక్టివేషన్‌తో).
  •              పోలీసు శాఖ సిబ్బందిలో సభ్యుని సహజ మరణానికి రూ. 1.50 లక్షల ఉచిత జీవిత బీమా (ఇది హోం గార్డులకు వర్తించదు.)
  •            మరణించిన పోలీసు సిబ్బంది పిల్లలకు (12-22 ఏళ్ల మధ్య) రూ. 2 లక్షల ఉచిత విద్య నిమిత్తం. అమ్మాయిలకు (0-22 ఏళ్ల మధ్య) అదనంగా రూ. 2 లక్షలు.
  •            పాక్షిక అంగవైకల్యానికి రూ. 30 లక్షల వరకు (బీమా నిబంధనల మేరకు)
  •            డెబిట్‌ కార్డు ద్వారా విమాన టికెట్‌ కొని, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. కోటి బీమా.
  •            డెబిట్‌ కార్డుతో వస్తువుల కొనుగోలుకు ఉచిత రక్షణ (వైట్‌ గూడ్స్‌) - రూ. 50వేలు
  •            కుటుంబ బ్యాంకింగ్‌ కార్యక్రమం కింద అదనంగా కుటుంబ సభ్యులకు 3 జీరోబ్యాలెన్స్‌ ఖాతాలు- వీటి ద్వారా అదనంగా రూ. 15 లక్షల ప్రమాద బీమా కవరేజి
  •            జీతం ఖాతాను పింఛను ఖాతాగా మార్చుకుంటే, పదవీ విరమణ తర్వాత కూడా పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి. (హోం గార్డులకు వర్తించదు)
  •            ఎడ్జ్‌ లాయల్టీ రివార్డుల ప్రోగ్రాం- అన్ని బ్యాంకింగ్‌ సేవలు/ఉత్పత్తులపై రివార్డులు.
  •            కొన్ని హోటళ్లు, సినిమా టికెట్లపై (బుక్‌ మై షోలో) ప్రత్యేక రాయితీలు.
  •            అన్ని బ్యాంకులకు ఉచితంగా నగదు బదిలీ (చెక్కు పుస్తకం / డీడీ / నెఫ్ట్‌ / ఆర్టీజీఎస్‌-ఆన్‌ లైన్‌ / మొబైల్‌).
  •            క్రెడిట్‌ కార్డులు, డీమ్యాట్‌, ఆన్‌ లైన్‌ ట్రేడింగ్‌ ఖాతాలు.
  •            అత్యాధునిక మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌.
  •            అత్యుత్తమ వడ్డీరేట్లతో గహ, వాహన, వ్యక్తిగత రుణాలు (హోంగార్డులకు వర్తించదు).
  •             గ్యారంటీ అవసరం లేదు
  •            రుణ ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. జరిమానా లేకుండా పాక్షిక చెల్లింపులకు అవకాశం.
  •            ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా టేకోవర్‌ సదుపాయం (బ్యాలెన్స్‌ బదిలీ)
  •            స్వాగత్‌ గహరుణాలు- సరిగా చెల్లించే ఖాతాదారులకులి 12 నెలల ఈఎంఐ మినహాయింపు
  • పైన పేర్కొన్నవాటిలో పదవీ విరమణ అనంతర సదుపాయాలు, సహజ మరణానికి బీమా మరియు వ్యక్తిగత ఋణాలు మాత్రం హోంగార్డులకు లేవు. మిగిలిన అన్ని ప్రయోజనాలూ పోలీసు సిబ్బందితో సమానంగా వారికీ అందుతాయి. కొత్త ఎక్కౌంట్‌లో వారి మొదటి నెల జీతం క్రెడిట్‌ అయిన తర్వాత నుంచి మాత్రమే పై సదుపాయాలన్నీ వర్తిస్తాయని గమనించాలి. కేవలం ఖాతాలు తెరవడం / వేరే బ్యాంకు నుంచి మారడం మాత్రమే కాదు, జీతం ఖాతా మార్పు సీఎఫ్‌ఎంఎస్‌ డేటాబేస్‌ లో కూడా ప్రతిఫలించాలి. ఈ ప్రయోజనాలు పొందాలంటే పోలీసు సిబ్బంది అంతా యాక్సిస్‌ బ్యాంకులో ఖాతాలు తెరవాలి లేదా ప్రస్తుతమున్న ఖాతాలను యాక్సిస్‌ బ్యాంకులోకి మైగ్రేట్‌ చేయాలి. ఇందుకోసం సంబంధిత ఏఓలు / డీడీఓ లకు రిక్విజిషన్‌ / ఆప్షన్‌ ఇచ్చి, వాటిని సీఎఫ్‌ఎంఎస్‌ డేటాబేస్‌లో చేర్పించాలి. ఏఓలు / డీడీఓ లు ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలి.

        యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి జీపీఏఐ

  • సామూహిక వ్యక్తిగత ప్రమాద బీమాపాలసీ- అన్ని ర్యాంకుల పోలీసు సిబ్బందికి గణనీయమైన జీవిత బీమా కవర్‌.
  •         ప్రస్తుతం పోలీసు సిబ్బందికి ఉన్న జీవిత బీమాలను చూస్తే రెండు రకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి సంక్షేమ విభాగం నుంచి, మరొకటి సోదరసంస్థ భద్రత (''ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ఉద్యోగుల ఉదార, మరియు పొదుపు మ్యూచువల్‌ అసోసియేషన్‌).
  •         సంక్షేమ విభాగం నుంచి జీవితబీమా పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 2.24 కోట్ల ప్రీమియం చెల్లిస్తోంది.
  •         'భద్రత' నుంచి అందించే జీవిత బీమా పాలసీకి భద్రతా విభాగమే ప్రీమియం చెల్లిస్తోంది. ప్రతియేటా రూ. 2.7 కోట్ల ప్రీమియం ఇలా కడుతూ వస్తున్నారు.

                      

వార్తావాహిని