యూనిట్
Flash News
ఆపరేషన్ ముస్కాన్తో వీధి బాలల సంరక్షణ

ఆపరేషన్
ముస్కాన్లో భాగంగా విజయనగరం జిల్లాలో 107 మంది వీధి బాలలను
సంరక్షించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి తెలిపారు. ఎస్పీ
మాట్లాడుతూ బాలల హక్కులను హరించడం, వారిని కార్మికులుగా
వినియోగించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. విజయనగరం పట్టణం, గజపతినగరం, ఎస్.కోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, పూసపాటిరేగ, చీపురుపల్లి
మరియు ఇతర పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వీధుల్లో తిరుగుతున్న అనాధ బాలలను, బాల కార్మికులుగా వివిధ హోటల్స్, మెకానిక్ షాపుల్లో, వర్కుషాపుల్లో మరియు
కర్మాగారాల్లో పని చేస్తున్న వారిని జిల్లా పోలీస్ యంత్రాంగం గుర్తించిందన్నారు.
వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి
వారిని బడుల్లో చేర్పించినట్లు పేర్కొన్నారు.