యూనిట్

నేటి బాలలే రేపటి భావి భారత జాతీయ సంపద : కృష్ణ జిల్లా ఎస్పీ

నేటి బాలలే రేపటి భావి భారత జాతీయ సంపద అని కృష్ణ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు.   ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా బడి బయట ఉన్న బాలలు, వీధిబాలలు, బాల కార్మికులను గుర్తించారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ   బాల్యాన్ని చదువుకు దూరం చేసి బాలకార్మికులుగా మార్చడం అమానుషమన్నారు.   పోలీస్‌, స్త్రీశిశు సంక్షేమ, ఇతర సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలో 241 మంది బాలురు, 90 మంది బాలికలు బడిబయట ఉన్నట్టు గుర్తించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ చిన్నారులను బాలకార్మికులుగా మారిస్తే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో  ఏఎస్పీ మోకా సత్తిబాబు, సీడీపీవో రాజేశ్వరి, డా.శ్రీహరి, కార్మిక శాఖ అధికారి శ్యాంబాబు, విద్యాశాఖ నుంచి రఘు, పోలీస్‌ అధికారులు ధర్మేంద్ర, మహబూబ్‌బాషా, చంద్రశేఖర్‌, తదితరులు  పాల్గొన్నారు

వార్తావాహిని