యూనిట్
Flash News
అనంతపురం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్

అనంతపురం:
అనంతపురం జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 31 మంది బాలలను గుర్తించారు. రెండు నెలల్లో 117 మంది బాలలకు విముక్తి కల్పించారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య
ఏసుబాబు ఆదేశాలతో సెప్టెంబర్ 6వ
తేదీన జిల్లాలో పోలీసులు ఈకార్యక్రమాన్ని ఏక కాలంలో చేపట్టారు. చదువుకోవాల్సిన
వయసులో తల్లిదండ్రుల సంరక్షణ లేక రోడ్లపై తిరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్లలో పనులు చేసుకుంటూ రోడ్లపై పడుకోవడం, ఎక్కడపడితే అక్కడ తింటూ కాలం వెళ్లదీస్తున్న బాలల
గుర్తింపునకు పోలీసులు వీధి వీధిన తిరిగి గుర్తించారు. ఈ డ్రైవ్లో మొత్తం 31 మంది వీధి బాలలను గుర్తించారు. వీరిలో ఒక బాలిక కూడా ఉంది.
వీరిలో 24 మంది చిన్నారులను తల్లిదండ్రులకు... ఐ.సి.డి.ఎస్ అధికారులకు
నలుగుర్ని, లేబర్ విభాగం అధికారులకు ముగ్గురిని
అప్పిగించినట్లు ఎస్.పి. తెలిపారు.