యూనిట్

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముష్కాన్

ఆపరేషన్‌ ‘ముస్కాన్‌’లో భాగంగా అనంరపురం  జిల్లా వ్యాప్తంగా  201 మంది వీధి బాలలను గుర్తించారు.   వీరిలో 200 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఒకరిని ఐసిడి ఎస్ అధికారుల వద్దకు పంపించారు. ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ బి. సత్యయేసుబాబు మాట్లాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో తల్లి దండ్రుల సంరక్షణ లేక రోడ్లపై తిరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్ లలో పనిచేసుకుంటూ కలం వెళ్లదీస్తున్న బాలలను గుర్తించి వారి తల్లి దండ్రులకు అప్పజెబుతున్నామన్నారు. 

వార్తావాహిని