యూనిట్
Flash News
సి.ఐ. పవన్ కిశోర్ దాతృత్వం

తప్పు ఎవరు చేశారో గాని అభం..శుభం తెలియని ఇద్దరు ఆడపిల్లల
జీవితాలు ప్రమాదంలో పడి విగతజీవులుగా మారారు. కాకినాడ తీర ప్రాంతంలో కాలుష్యాన్ని
వెదజల్లుతున్న ఫ్యాక్టరీలు, అదిచాలదన్నట్లు వాటి వ్యర్థాలను
సైతం రోడ్లపైనా, బహిరంగ ప్రదేశాలలోనూ డంపింగ్
చేస్తున్నారు. దీని వలన చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అనే
ఇబ్బందులు పడటంతో పాటు రోడ్డుపైన వేస్తున్న వ్యర్థాలవల్ల ప్రమాదాలకు గురై
మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలు. సూర్యాపేట గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఏ
ఫ్యాక్టరీ వారు వేశారో కాని మరుగుతున్న వ్యర్థాన్ని అక్కడ డంప్చేసి వెళ్లిపోయారు.
తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఆ గ్రామంలో ఉన్నవారు అక్కడ
బహిర్బూమికి వెల్లడానికి వచ్చారు. అందులో ఇద్దరు ఆడపిల్లలు యర్ల, పిరమి జ్యోతి అనే అమ్మాయిలు
వ్యర్థాలలో కాలువేశారు. కాలు వేయడమే తడవుగా ఇద్దరి కాళ్లు కాలిపోయాయి. బొబ్బలు
వచ్చి ఇంటికి వచ్చారు. ప్రథమ చికిత్స నిమిత్తం బర్నాల్ రాశారు. కాని తగ్గలేదు, రానురాను.. వారి కాళ్లు పాడయి
కదలలేని స్థితికి వచ్చారు. దీంతో సూర్యాపేట గ్రామస్థులు పరిస్థితిని కాకినాడ రూరల్
సిఐ పవన్కిశోర్కు ఫిర్యాదు చేశారు. సిఐ బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకుని, హుటాహుటీన బాధితులను ట్రస్ట్
ఆసుపత్రిలో చేర్పించారు. అంతేగాక రూ. 10 వేలు
ఆర్థిక సాయాన్ని అందించారు. పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల యజమానులను సంప్రదించి
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని తెలిపారు. దీంతో అన్ని కంపెనీలు కలిసి
ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందించాయి. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడం వల్ల కాళ్ళు
పూర్తిగా కాలిపోయిన బాలికలు ఇరువురు నడవగలుగుతున్నారు. విషయం తెలుసుకున్న
గ్రామస్థులు సి.ఐ. పవన్కిశోర్ను, తిమ్మాపురం పోలీసు సిబ్బందిని
అభినందించారు.