యూనిట్

పోలీసు గృహిణులకు ప్రత్యేకం - ఆకాశం నినదిస్తోంది

పోలీసు గృహిణులకు ప్రత్యేకం

ఆకాశం  నినదిస్తోంది

ఎర్రని బాల సూర్యుడు పెద్ద కమలాపండులా తూర్పు దిక్కున పైకి లేస్తుంటేకోడి పుంజులు ఠీవిగా మెడలు నిక్కపొడుచుకుని మరీ ''కొక్కొరోకో'' మంటూ తెల్లారిపోయిందని తట్టి లేపుతుంటేచల్లని పిల్లగాలుల సోయగానికి నిద్రలేవడానికి బద్ధకిస్తూ ''మరో ఐదు నిమిషాలు పడుక్కుంటానమ్మా'' అని పిల్లలు ముసుగుతన్నుతూ వుంటేతల్లి రేడియో తిప్పి భక్తి రంజని పాట వినిపిస్తేమత్తంతా వదిలి ఠకీమని లేచి కూర్చునేవాళ్ళం. మా చిన్నప్పుడు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్త్రీల పాటలలో సేకరించిన సూర్యుడి పాటకి ఆయనే సంగీతం సమకూర్చి ఆయనే పాడిన పాట ఇది.

శ్రీసూర్యనారాయణా - మేలుకో - హరి సూర్యనారాయణ

పొడుస్తు బాలుడూ పొగడ పూవూ ఛాయ

పొగడపూవూ మీద పగడంపు పొడి ఛాయ   ||శ్రీసూర్య||

మధ్యాహ్న బాలుడూ మల్లెపూవూ ఛాయ

మల్లెపూవూ మీద వజ్రంపు పొడి ఛాయ      ||శ్రీసూర్య||

గుంకుతూ బాలుడూ గుమ్మడీపూఛాయ

గుమ్మడీ పూమీద గురివింద పొడి ఛాయ     ||శ్రీసూర్య||

ఇలా సూర్యుడి పాటతో లేలేత సూర్యకిరణాలలోని నులి వెచ్చదనం మనస్సును తాకుతుంటే రోజు మొదలయ్యేది. ఆ రోజుల్లో నైతే మొన్నటి నిన్నటి తరాల మాట - గోడకి పెద్దగా గంటలుకొట్టే గడియారమూపడుక్కునే చోట చిన్న బల్ల మీద చిన్న గడియారం - నిద్రలేపటానికి - (అలారంపీస్‌ అనేవాళ్ళం) చేతికి వాచీఏదో ఒక రవివర్మ చిత్రపటం - మధ్యతరగతి కుటుంబంలో తప్పక ఉండేవి. గంటలవారీగా రేడియో కార్యక్రమాలని స్కూళ్ళకీకాలేజీలకీ వెళ్ళేంతవరకూ - పనులు చేసుకుంటూ వినేవారం. ఠంచనుగా 7 గంటలకి ''ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాథరావ్‌ - తిరుమలశెట్టి శ్రీరాములు - కొత్తపల్లి సుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురూ అద్భుతమైన వాచికంతోమంచి ఉచ్ఛారణతో ఢిల్లీ నుంచి వార్తలు చదివేవారు. విజయవాడహైద్రాబాద్‌ రేడియోలలో కార్యక్రమాలూనాటకాలూకవితలూ చదివే వారంతా ఆనాటి పేరుమోసిన మహా మేధావులే. గొప్ప కవులూసినీకవులయిన దాశరథి గారూ (ఆయన పూర్తిపేరు దాశరథి కృష్ణమా చార్యులు)దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారూమహా సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారూబాలాంత్రపు నళినీ కాంతరావ్‌బాలాంత్రపు రజనీకాంతరావు లాంటి మహామహులు రేడియోని ఏలారు. శనిఆదివారాలు పిల్లలకిపెద్దలకీ పెద్ద ఆటవిడుపు. మరి సందడే సందడి. న్యాయపతి రాఘవరావు గారు రేడియో అన్నయ్యగాన్యాయపతి కామేశ్వరిగారు - ఆయన భార్య - రేడియో అక్కయ్యగా మద్రాసులో 'బాలవినోదం', 'బాలానందంఅనే పిల్లల కార్యక్రమాలు ప్రారంభించారు.  అందులో ప్రముఖ చిత్రకారుడూప్రముఖ చలనచిత్ర దర్శకుడు బాపూగొప్ప సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కూడా పాల్గొనేవారు మద్రాసులో.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌లో  శనివారం'బాలానందం', ఆదివారం 'బాలవినోదంకార్యక్రమాలు ప్రసారం చేసేవారు. ''రారండోయ్‌! రారండోయ్‌! పిల్లల్లారా రారండోయ్‌! హైదరాబాదు బాలలమూ! జైహింద్‌ అంటూ పిలిచామూ'' అంటూ మొదలయ్యే రేడియో అన్నయ్య గారి ''బాల వినోదం'' పిల్లలూపెద్దలూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసే కార్యక్రమం ఇది. ఆదివారం మధ్యాహ్నం 3 గం|| నుంచీ 4 గం|| వరకు ఒక నాటకం వచ్చేది. హైదరాబాద్‌లో నయితే శ్రీ నండూరి విఠల్‌శ్రీమతి శారదా శ్రీనివాసన్‌విజయవాడ నుంచి శ్రీ బందా కనక లింగేశ్వరరావ్‌ గారుశ్రీ నండూరి సుబ్బారావు గారువి.వి. కనకదుర్గనాగరత్నమ్మసీతారత్నమ్మశ్రీ కత్తుల వెంకటేశ్వరరావు (రసన సమాఖ్య అధ్యక్షుడు - గణేశ్‌ పాత్రో ప్రముఖ నాటక రచయితమామగారు) తమ అద్భుతమైన వాచికంతో నాటకాలనీసినీ నటులు దిగదుడుపుగాఆద్యంతం రక్తి కట్టించేవారు. సంస్క ృత పరిచయంతో శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రిగారుశ్రీ మరింగంటి శ్రీరంగాచార్యమహా మహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల రామచంద్రుడు గారు (ఈయన మా గురువు గారు) సంస్క ృతము నేర్పుతూఅనేక కావ్యాలనీ పరిచయం చేసిన ధన్యాత్ములు. సంగీత కచేరీలలో ఆనాటి మహా విద్యాంసులు పాడేవారు. ఇవికాక ఒక గంట చలనచిత్రంవారానికొకసారిరోజూ శ్రోతలు కోరిన సినిమా పాటలూ ఉండేవి. అవి కంప్యూటర్లూమొబైల్‌ ఫోన్లూ లేని రోజులు. చాలామంది ఇళ్ళలో లాండ్‌ లైన్‌ కూడా ఉండని రోజులు. రేడియో ఎంతో విజ్ఞానవినోదాలని పంచి ఇచ్చేది. మధ్యాహ్నం 12.30 గం||లకు కార్మికుల కార్యక్రమం ప్రసార మయ్యేది. ఇందులో పెద్దయ్యగా ఉషశ్రీ గారు,(పురాణ పండ వెంకట దీక్షితులురామాయణభారత కథలకి ప్రాచూర్యం కలిగించిన గొప్ప రచయిత) పెద్దక్కగా రతన్‌ ప్రసాద్‌ గారురాంబాబుగా డి.వెంకట్రామయ్య గారు హాస్యాన్ని పండిస్తూ చక్కని సందేశాలను అందించేవారు. ఆతర్వాత కాలక్రమేణా ఈ పాత్రలే చిన్నక్కఏకాంబరం,బాలయ్యగా బాలలకు మార్చారు. అంతేకాకుండా సాయంత్రం గ్రామస్తుల కార్యక్రమం ప్రసారమయ్యేది. విజయవాడ కేంద్రం నుండి బావగారి కబుర్లు కార్యక్రమాన్ని సి. రామ్మోహన్‌ రావుగాడేపల్లి సూర్యనారాయణ నిర్వహించే వారు. వినోదాల వీరయ్య కార్యక్రమాన్నీహరికథలనీ ప్రయాగ నర్సింహ శాస్త్రి  గారు నిర్వహించేవారు. 1971లో తెలుగు వివిధ భారతి మొదలైంది. ప్రాయోజిత కార్యక్రమాలు కూడా ఉండేవి. వీటికి ప్రైవేట్‌ ఏజెన్సీల నుండి నాటకాలునాటికలు తీసుకొని ప్రసారం చేసేవారు. మహిళా కార్యక్రమాలు ('రంగవల్లి', 'మహిళా సమాజం') పేరున రోజూ 1:30కి మహిళా కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. వీటిని న్యాయపతి కామేశ్వరిగారు నిర్వహించేవారు. ఉద్యోగినుల వికాస కార్యక్రమం 'సమతఅనే పేరుతో నిర్వహించేవారు. 'గ్రామలక్ష్మిపేరుతో గ్రామీణ స్త్రీల కార్యక్రమం రాత్రి వచ్చేది. ఈ కార్యక్రమాన్ని తురగా జానకీరాణి నిర్వహించేవారు. ఈవిడే తరువాత 'బాలానందం' 'బాలావినోదంకార్యక్రమాలకు రేడియో అక్కయ్యగా  వ్యవహరించారు.

పైగా ఈనాడు రేడియోలలో పూర్తిగా మృగ్యమైపోయిన గీతాలు ఆనాడు యావన్మంది ప్రజలనిదేశభక్తి ఉద్వేగంతో కుదిపేసి ఉత్తేజపరిచిన దేశభక్తి ప్రబోధ గీతాలు రేడియోలో కోకొల్లలుగా వచ్చేవి. అప్పట్లో వింజమూరి శివరామారావు గారు (ఈయన ప్రముఖ కవి కృష్ణశాస్త్రిగారి మేనల్లుడు)మధురాంతకం రాజారాంగారుయండమూరి సత్యనారాయణరావుగారు అనేక దేశభక్తి గీతాలు రాసేవారు. పులికంటి కృష్ణారెడ్డిగారు రాసీఉపద్రస్త కృష్ణమూర్తిగారు స్వరపరిచిన ''విశాల భారత దేశమిదిహిమాలయాలకు నిలయమిది'' గీతముఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు రాసిన ''నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుందిసురలోక మెక్కడుంది'', పాటవారి కుమారుడు ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మగారు రాసిన 'తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమాఈ పాటను శ్రీ ఎంఎస్‌ శ్రీరామ్‌ స్వరపరిచారుపాటఇలా ఎన్నో పాటలు ప్రతి వారిలోను దేశభక్తిని

ఉద్దీపింపజేశాయి. 1962లో చైనా యుద్ధం జరినప్పుడు 'పాంచజన్య శంఖము - ప్రపంచ ధార్మికాంఖము/ఆది దేవుడార్థవనుడు ఊదే రణాంగనమ్మున అంటూశంఖాన్ని పూరించి కదం తొక్కుతూపదంపాడుతూ దేశం కదిలేటట్టుగా ప్రజల్ని సాయుధ చిత్తుల్ని చేసిదేశభక్తి దొంతరలుగా పెంచిన ప్రబోధ గీతికలు ఎన్నో వచ్చాయి. ఇలాంటి ఉద్బోధ గీతాలే దురదృష్టవశాత్తు ఈనాడు చాలామంది విద్యార్థులలో వెర్రితలలు వేస్తున్న దేశవ్యతిరేకతా భావాలు పొరపాటున కూడా చొరకుండ చేశాయి. 'ప్రతి భారతీయుడులోను కూడ ప్రప్రథమంగా నేను భారతీయుడుని, 'అని దేశభక్తి భావన ఊపిరిపోసే దేశభక్తి గీతాలు రావాలిమొబైల్‌వాట్సాప్‌ట్విట్టర్‌ల సంస్కృతి పూర్తిగా తగ్గి ప్రతిభారతీయుడి గుండె దేశభక్తి లబ్‌డబ్‌లతో కొట్టుకోవాలి.

అసలు ఇంతమందిని గతంలో బాగా అలరించీఇప్పటికీ మురిపిస్తున్న రేడియో కథా కమామీషూ ఏమిటంటే - 1860 సం||లో స్కాటిష్‌ భౌతిక శాస్త్రవేత్త అయిన James Clark Maxwell ఈ రేడియో తరంగాల ఉనికిని ముందే ఊహించి చెప్పాడట! 1866 సం||లో అమెరికాలో Mahlon Loomis  అనే దంత వైద్యుడు Wireless Telegraphyకు ని విజయవంతంగా ప్రదర్శించాడట! ఎలాగంటే లూమిస్‌ ఒక మీటర్‌ని ఒక గాలి పటానికి అమర్చిమరో గాలిపటాన్ని ''పదపదవే వయ్యారి గాలిపటమా'' అని కదిలించ గలిగాడట! 1886లో జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త Henrich Rudolph Hertz  ఎలక్ట్రిక్‌ కరెంటులో వేగంగా పొందే మార్పులు స్పేస్‌లో రేడియో తరంగాలుగా పంపవచ్చని నిరూపించాడు. ఇటలీ దేశస్థుడైన Guglielme Marconi  అనే భౌతిక శాస్త్రవేత్త Hertz ప్రతిపాదించిన రేడియో తరంగాలకి ఆకర్షితుడై 1895లో వైర్‌లెస్‌ సిగ్నల్‌ పంపించాడు. 1896లో ఈ సిగ్నల్‌ని ఒక మైలు దూరం పంపించాడు. 1898లో మార్కొని ఇంగ్లండు వెళ్ళిపోయి ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌ని మొట్టమొదటిగా బ్రాడ్‌కాస్ట్‌ చేశాడు. 1899లో జురరవఞ తో తన రేడియో ఫ్యాక్టరీని ప్రారంభించి ఆవిధంగా ఫ్రాన్స్‌కిబ్రిటన్‌కీ లంకె కుదిర్చాడు. అతని వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ సిగ్నల్స్‌ని ప్రసారం చేసింది 1909లో భౌతిక శాస్త్రంలో మరొకరితో కలసి నోబెల్‌ ప్రైజ్‌ మార్కొని అందుకున్నాడు. 1921లో రేడియోలో ''వాణి'' - గొంతు వినిపించాడు. 1922లో మార్కొని షార్ట్‌వేవ్‌ ట్రాన్స్‌మిషన్‌ని ప్రవేశపెట్టాడు.

మొట్టమొదట ఈ రేడియోని ఒక ఓడ నుంచి మరో ఓడకూఒక ఓడ నుంచి తీరం వరకూ సమాచారం అందించేటందుకు ఉపయోగించేవారు. సముద్రంలోని భయంకర ఆటుపోట్లూఓడ మునకల గురించి చెప్పటానికీ వైర్‌లెస్‌ ఎక్విప్‌మెంట్‌ని ఉపయోగించేవారు. 1899 అమెరికా ఆర్మీ (సైన్యం) వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ని ప్రవేశపెట్టింది. తర్వాత నేవీ కూడా ఈ వైర్‌లెస్‌ సిస్టంని అనుసరించింది. తమాషా ఏమిటంటే అంతవరకూ నేవీ వార్తలు చేరవేయటానికి Homing Pigeons (పావురాలు)నీVisuar Signalling  నీ ఉపయోగించేది. మొట్టమొదటి సారిగా అమెరికాలోని Massachusetts లోని మార్కొనీ స్టేషన్‌ బ్రిటిష్‌ చక్రవర్తి

Edward VII   అమెరికన్‌ ప్రెసిడెంట్‌ Theodore Roosevelt  పంపుకున్న గ్రీటింగ్స్‌ని 1905 సం||లో అందించింది. కూవవ Lee De Forest అనే శాస్త్రవేత్త ఈ వైర్‌లెస్‌ సిస్టమ్‌కి మొదటిసారిగా 'రేడియోఅని పేరు పెట్టాడు. ఆయనే AM Radio కనిపెట్టి అనేక రేడియో స్టేషన్లు ప్రసారం చేసే వీలు కలిగించాడు. 

భారత దేశంలో ప్రప్రధమంగా 1924లో మద్రాసులో (చెన్నై)లో బ్రాడ్‌ కాస్టింగ్‌ మొదలైంది. ఇది అప్పటి మద్రాసులోని ఒక ప్రైవేటు రేడియో సర్వీస్‌. తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం 'ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీఅనే ప్రైవేటు కంపెనీగా బొంబాయి (ముంబై)కలకత్తా (కోల్‌కతా)లో రేడియో స్టేషన్లు నెలకొల్పటానికి అనుమతి మంజూరు చేసింది. ఈ కంపెనీ 1930 సం||లో దివాలా తీసింది. ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నిర్వహణలో ఈ కంపెనీ ఇండియన్‌ స్టేట్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌గా రూపొందింది. 1936 సం||లో ఈ కార్పొరేషన్‌నే 'ఆల్‌ ఇండియా రేడియోఅనే పేరుతో పిలిచారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో  ఆల్‌ ఇండియా రేడియో నడిచేది. 1947 సం|| భారత దేశం స్వాతంత్య్ర ఊపిరిని పీల్చుకున్నాక ఆల్‌ ఇండియా రేడియోను మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ తన నిర్వహణలోనికి తీసుకుంది. భారతదేశ మొట్టమొదటి ప్రధాని శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూ గారి ఆశయాలు ముఖ్యంగా మూడుండేవి. రాజకీయ సమైక్యత((Political Integration),)ఆర్ధికాభివృద్ధి (Economic Development),  సాంఘిక నవీనత (Social Modernisation). ఆనాడు పత్రికలు తప్ప మరే దృశ్యశ్రవ్య మాధ్యమాలు లేని కారణంగా రేడియోనే బహుళంగా ఈ ఆశయాలు సిద్ధింప చేయటానికిబహుళ ప్రాచుర్యానికి ఉపయోగించేవారు. రేడియో ద్వారానే జాతీయసాంఘిక విశేషాలుమార్పులువాతావరణ ఎగుడు దిగుళ్ళూ ప్రజలకి తెలిసేది. సాంఘిక సమైక్యతకి రేడియో చిహ్నమైంది.

 

1950లలో 60లలో అమీన్‌ సయానీ గారి బినాకా గీత్‌మాలా దేశాన్ని ఏలింది. ఆయన చక్కటి వాచికంఉచ్ఛారణ అనేకమందిని ఆకట్టుకున్నాయి. హిందీ హీరో సునీల్‌ దత్‌తెలుగు హీరో కొంగర జగ్గయ్య రేడియోతోనే తమ జీవితాలని ప్రారంభించారు. 1967లో భారతదేశంలో 'వివిధ భారతిఅనే వ్యాపార రేడియో (Commercial Radio) ప్రారంభమైంది. ''యే వివిధ్‌ భారతీహై ఆకాశవాణీకా పంచరంగీ ప్రోగ్రాం'' అంటూ మొదలయ్యేది. జయ్‌మాలాస్పెషల్‌ జయ్‌మాలాహవామహల్‌ఇన్‌సేమలియేసంగీత్‌ సరితాభూలేబిసరే గీత్‌చిత్రలోక్‌సర్‌గమ్‌ కె సితారేఉజాలె ఉనికీయాదోం కేఛాయాగీత్‌ ప్రతీ శనివారం ''ఫౌజీ భాయియోంకేలియే'' అని దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల వినోదవికాసాల కోసం ఏదైనా రంగానికి చెందిన ప్రముఖులని పిలిచి సినిమా పాటలు నిర్వహింపజేసేవారు. ఈ కార్యక్రమాలు కొన్ని తరాల శ్రోతలని ఉర్రూత లూగించాయి. తర్వాత 1970వ దశకంలో ప్రాంతీయ వివిధ భారతీ వచ్చింది. 1999లో FM   రేడియో (Frequency Modulated Radio)  వచ్చింది. అప్పుడు 12 నగరాలలో 21 ఛానల్స్‌ పెట్టారు. 2005లో 242 ఛానల్స్‌ అయ్యింది. ఈ వివిధ భారతిఎఫ్‌ఎం రేడియోలలోని ప్రకటనల వలన రేడియోకి ఆదాయం చేకూరాలని భావన. కానీ అది చాలా స్వల్పం.

రేడియోలో ప్రొద్దున్నే 6 గం|| నుంచీ 4 నిమిషాల పాటు సాగే భావన కార్యక్రమంలో నేను 25 సం|| నుంచీ పాల్గొంటున్నాను. విజయవాడ రేడియోలో కూడా 1983-86 మధ్య కాలంలో అనేక చర్చలలో Radio Talks  లో పాల్గొన్నాను. కంప్యూటర్స్‌సెల్‌ఫోన్లూ వచ్చి అనేక కళారంగాలనీసంస్క ృతినీ దెబ్బతీస్తున్నాయి. రేడియోని చాలామంది మరిచిపోయారు. మరేం... డి.జి.పి. ఆఫీసులో కమ్యూనికేషన్స్‌ ఒక విభాగానికి 'మార్కొనిఅని పేరు పెట్టారు. విజ్ఞానవినోదాల పెట్టి రేడియో! చేయి జార్చకండి! అమూల్యమైనది పోగొట్టుకుంటారు!!

అందుకే మన యెనెస్కో నవంబర్‌ 3, 2011న - జి 36/కె జనరల్‌ కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 13 నాడు 'వరల్డ్‌ రేడియో డే'గా ప్రకటించింది. మనందరికీ ఆహ్లాదం కలిగించింది.

                నాడు నేడు కూడా నవ్యపథóములేర్చి

                దివ్యమార్గగామి తెలుగువాడు

                ప్రాతకొత్తనడుమ బంగారు వంతెనల్‌

                నిలిపినట్టివాడు తెలుగుబిడ్డ!    

              (నార్ల చిరంజీవి - 'తెలుగుపూలు')

''దేశభక్తి వెల్లువలా ప్రవహించాలి''.

వార్తావాహిని