యూనిట్
Flash News
పటేల్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి

సర్దార్
వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా 'ఏక్తా దివస్' కార్యక్రమాన్ని డిఐజి గోగినేని విజయకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బంది, బ్యాండ్ గ్రూప్ సిబ్బంది మంగళగిరి పురవీధుల గుండా ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా
డిఐజి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని
అందరూ ఐకమత్యంగా మెలగాలని సూచించారు. 'రన్ఫర్ యూనిటీ'ని తెలిపే ప్లకార్డులు చేతభూని, సామాన్య ప్రజలకు తెలిసేలా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి సెంటర్లో
జాతి సమైక్యతను చాటేలా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్
కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు పి.వి.హనుమంతు, బి.శ్రీనివాసబాబ్జి, ఆర్.ఐ.లు సూర్యారావు, కూర్మారావు, ప్రభాకర్రావు, రాజశేఖర్, సురేష్లతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.