యూనిట్
Flash News
జాతి సమైక్యతే పటేల్ లక్ష్యం

3వ పటాలములో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భముగా 'రన్ ఫర్ యూనిటి'ని కమాండెంట్ బి.శ్రీరామమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో 140 మంది అధికారులు, 40మంది స్కూలు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఉదయం 11 గంటలకు వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల
వేసి నివాళులు అర్పించారు.
జాతి సమైక్యతా
దినోత్సవం సందర్భంగా సాయంత్రం సిబ్బంది, ఎన్సీసీ కేడెట్స్తో దాదాపు 300 మందితో ప్రజలలో సమైక్యతా భావాన్ని
పెంపొందించే మార్చ్ఫాస్ట్ను నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్
ఎం.బి.వి.వి.ఎస్.నారాయణ, ఎస్.దేవానందరావు, జి.లక్ష్మినారాయణ, ఆర్.ఐ.లు రామకృష్ణ, శేఖర్రావు, బిడబ్యూఓ సతీష్, సత్యనారాయణ, పెంటారావు, పటాలము సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి గారు, పటాలము ఐజిపిగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
దేశంలో ప్రజలందరూ ఐక్యతతో ఉంటే ఈ దేశము ఇంకా ప్రగతి పథంలో పయనిస్తుందని తెలిపారు.