యూనిట్
Flash News
పోలీస్ కుటుంబాలకు ఆర్థిక సాయం

16వ పటాలములో కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.రత్నాకర్ (పిసి 1034), ఎం.పొల్లయ్య (పిసి 989)లు ఇటీవల మృతిచెందారు. ఆయా కుటుంబాలకు భద్రత నుండి విడుదలైన మొత్తాన్ని
కమాండెంట్ వి.జగదీష్కుమార్ అందజేశారు.
రత్నాకర్ మాతృమూర్తికి రూ.4లక్షలు, ఎం.పొల్లయ్య సతీమణికి రూ.4లక్షల భద్రత చెక్కులను కమాండెంట్ అందజేశారు. బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ
ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.