యూనిట్

రక్తదాన శిబిరము

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా 3వ పటాలము యూనిట్‌ హాస్పిటల్‌ నందు కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి ఆదేశాల మేరకు అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు అధ్యక్షతన రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా రక్తదానం చాలా ఉన్నతమైనదని రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని అన్నారు. శిబిరంలో 61 మంది సిబ్బంది రక్తదానం చేశారు.

పోలీసు సిబ్బంది యొక్క పిల్లలకు వ్యాసరచన పోటీలువకృత్వ పోటీలు నిర్వహించారు. 67 మంది విద్యార్థినివిద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెట్స్‌ ఎస్‌.దేవానందరావుజి.లక్ష్మినారాయణడాక్టర్లు కే.కామరాజుయూనిట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావుఆర్‌.ఐ.లు బిఎస్‌సి శేఖర్‌రావుసత్యనారాయణఎం.విల్సన్‌బాబుఆర్‌.ఎస్‌.ఐ. రవితేజమురళీకృష్ణప్రిన్సిపల్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని