యూనిట్

అంతర్ రాష్ట్ర నేరస్థుడ్ని అరెస్ట్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర  నేరస్థుడు ఈపు వెంకటేష్ ను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డి గూడెం సి ఐ బి ఎం నాయక్ తెలిపారు.  జంగారెడ్డి గూడెం లో 2018 , 2019 , సంవత్సరాలలో రెండు దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుండి రూ. 1 . 63 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతను పాత నేరస్థుడన్నారు. ఇతని పై ఉభయగోదావరి  జిల్లాలతో పాటు కృష్ణ , ఖమ్మం జిల్లాల్లో ౩౦ కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ఇతన్ని పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ చూపించిన జంగారెడ్డి గూడెం ఎస్సై ఏ దుర్గా రావుఏ ఎస్సై ఎన్. వి సంపత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎన్ రాజేంద్ర, కానిస్టేబుల్స్ కె కిరణ్, బి హరిప్రసాద్ లను అభినందించారు.

వార్తావాహిని