యూనిట్

సమర్ధవంత పోలీసింగ్ తో జిల్లా ప్రశాంతం

అనంతపురం జిల్లా ప్రశాంతత కోసం పోలీసు యంత్రాంగం సమర్థవం తంగా పని చేసిందని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన ట్రైనీ ఎస్పీ మణికంఠచండోలు, అదనపు ఎస్పీ రామాం జనేయులు, డీఎస్పీలు శ్రీనివాసులు, వీర రాఘవ రెడ్డి, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి 2019 సంవత్సరానికి సంబంధించిన క్రైం వివరాలను   వెల్లడించారు. నూతన సంవత్సరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రశాంతత జీవనానికి మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు.

మహిళల భద్రతపై మరింత దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో గతేడాది 5902 కేసులు నమోదు కాగా.... 2019లో 6834 నమోదయ్యాయి. ఇసుక, మట్కా, పేకాట, గుట్కా, ఎర్రచం దనం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున దాడులు చేయడంతో 1925 కేసులు ఈ ఏడాది అదనంగా పెరిగాయన్నారు. బాడిలీ నేరాలు ఈ ఏడాది 1654 నమోదయ్యాయి. గతేడాది 114 హత్యలు నమోదు కాగా ఈ ఏడాది 99 నమోదయ్యాయి. దోపిడీ, దొంగతనాలకు సంబంధించి గతేడాది 551 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 630 నమోదయ్యాయి. ఈ ఏడాదిలో చోరీల్లో 70 శాతం రికవరీ చేశామన్నారు. గతేడాది మహిళా హత్యలు 36 జరగగా... ఈ ఏడాది 23 జరిగాయి. రోడ్డు ప్రమాదాలు జిల్లాలో గతేడాది 930 జరగగా... 526 మృతి చెందారు. ఈ ఏడాది 1178 రోడ్డు ప్రమాదాల్లో 585 మంది మృతి చెందారు. చీటింగ్‌, నమ్మకద్రోహం, నకిలీకరెన్సీ తదితర వైట్‌కాలర్‌ నేరాలు గతేడాది 363 జరగగా... ఈ ఏడాది 399 నమోదయ్యా యి. ఈ ఏడాది 702 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డా యన్నారు.

2450 కేసులు లోక్‌ అదాలత్‌ ద్వారా పరి ష్కరించినట్టు తెలిపారు. అక్రమ మద్యం పరం గా గతేడాది 324 కేసులు నమోదు చేసి... 341 మందిని అరెస్టు చేసి 9377 మద్యం సీసాలు 323 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు తె లిపారు. ఈ ఏడాది 1056 కేసులు నమోదు చేసి 1187 మందిని అరెస్టు చేసి 35053 మద్యం సీ సాలు, 4185 లీటర్ల నాటుసారా, 36 వాహ నాలు, 80 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నట్టు వివరిం చారు. 33450 లీటర్ల సారా ఊటను ధ్వంసం చే శామన్నారు. ఇసుక అక్రమ రవాణా పరంగా ఈ ఏడాది 415 కేసులు నమోదు చేసి 813 మందిని అరెస్టు చేసి 626 వాహనాలు, 8500 టన్నుల ఇ సుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. గుట్కా పరంగా గతేడాది 23 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేసి రూ. 11,46,632 విలువ చేసే గుట్కా పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది 216 కేసుల్లో 312 మందిని అరెస్టు చేసి రూ. 23,27,024 విలువ చేసే గు ట్కాను సీజ్‌ చేసినట్టు తెలిపారు. మట్కా, పేకా ట, క్రికెట్‌ బెట్టంగ్‌ల పరంగా గతేడాది 875 కేసు లు నమోదు చేసి... రూ. 1.85 కోట్లు స్వాధీనం చే సుకోగా ఈ ఏడాది 760 కేసులు నమోదు చేసి రూ. 1.17 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో గ తేడాది 6 కేసుల్లో 16 మంది నిందితులను అరె స్టు చేసి రూ. 49,98,745 విలువ చేసే 2699 కిలో ల 88 దుంగలు, 8 వాహనాలను సీజ్‌ చేయగా... ఈ ఏడాది 5 కేసుల్లో 50 మందిని అరెస్టు చేసి రూ. 56,21,650 విలువ చేసే 3518 కిలోల 130 దుంగలు, 12 వాహనాలను స్వాధీనం చేసుకు న్నారు. బైండోవర్‌ల పరంగా గతేడాది 17096 మందిని చేయగా... ఈ ఏడాది 37944 మందిని బైండోవర్‌ చేసి శాంతిభద్రతలను కాపాడారు.

వివిధ నేరాల్లో నిందితులు, ప్రజా వ్యవస్థకు భంగం కలిగించే ఆరుగురు కరుడుగట్టిన నేరస్తులు కాయల లింగమయ్య, పొట్టి రవి, బాలకృష్ణ, అమర్‌నాథ్‌, వెంకటేశులు, పిచ్చల పెద్దన్నలపై పిడీయాక్ట్‌ నమోదు చేశామన్నారు. ముందస్తు చర్యలతో 9 హత్యలు, 3 కిడ్నాపులు నిలువరించినట్టు తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న స్పందన కార్యక్రమంతో 5603 ఫిర్యాదులు స్వీకరించి 442 కేసులు నమోదు చేసి 5122 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. డయల్‌-100 ద్వారా 15442 కాల్స్‌ ద్వారా సేవలందించి 921 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో జీరో ఎఫ్‌ఐఆర్‌లో రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా ఈ ఏడాది 298 మంది పిల్లలను కార్మి కుల నుంచి విముక్తి కల్పించామన్నారు.

వార్తావాహిని