యూనిట్

పసుపులేటి మురళి @ బెల్ట్ మురళి హత్య కేసును ఛేదించిన పోలీసులు

21-12-2019వ తేదీ రాత్రి 8-20 నిమిషములకు తిరుపతిలోని  SK పాస్ట్ పుడ్ సెంటర్, సుబాష్ నగర్ టర్నింగ్ వద్ద పసుపులేటి మురళి అతని స్నేహితుడు మల్లరపు చిన్న మాట్లాడుకొనుచుండగా, నెహ్రూనగర్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇనపరాడ్లుతో వచ్చి, మురళికృష్ణ @ బెల్టు మురళి తలపైన కొట్టగా మురళీ క్రింద పడిపోయిన్నాడు. మరికొందరు కత్తులతో మురళి వీపుపైన పొడవగా అతను అక్కడికక్కడే  చనిపోయాడు. హంతకులు ముందే సిద్దంగా ఉంచుకొన్నటువంటి ఆటో మరియు స్కూటీలలో పారిపోయినారు. మురళి బార్య సత్యా ఇచ్చిన ఫిర్యాదు పై 21-12-2019 వతేదీ తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ లో  కేసు నమోదు చేయడమైనది.

పసుపులేటి మురళి  హత్య కేసులో ముద్దాయిలను 07-01-2020వ తేదీ సాయంత్రం తిరుపతిలో10 మందిని మరియు రేణిగుంటలో7 మంది ముద్దాయిలను మొత్తం 17 మంది ముద్దాయి అరెస్టు చేసి,వారు హత్యకు ఉపయోగించిన ఒక ఆటో, రెండు స్కూటీలు, మూడు సెల్ ఫోనులు, రెండు ఇనుప రాడ్డులు, నాలుగు కత్తులు, స్వాధీనం చేసుకోవడమైనది.

మురళి మరియు ప్రమోదు వారి స్నేహితులు కలసి 2017 వ సంవత్సరములో సాకే భార్గవ్ అనే వ్యక్తిని పరసాల వీధిలో హత్య చేయడము జరిగినది. భార్గవ్  హత్య పై తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్ లో  కేసు నమోదు చేయడమైనది . ఆ కేసులో పసుపులేటి మురళి జైలుకు వెళ్ళినాడు. ఆ కేసు పై పసుపులేటి మురళి పైన రౌడీ షీటు  కూడా తెరవబడినది. సాకే భార్గవ్ హత్య కేసులో స్నేహితులను మరియు బంధువులు రాజీకి రాలేదని మురళి బెదిరించినాడు.

దీని మూలముగా గుజ్జల గజేంద్ర తన ఇంటిలోకి  ముద్దాయిలు అయిన 1) డి.నరసింహులు2) డి.మల్లికార్జున, 3) జి.అరుణ్ కుమార్ @ అరుణ్ @ కొండ అరుణ్,, 4) కే.హరి కృష్ణ @ హరి, 5) కోయ గిరి బాబు @ నాగరాజు,, 6) జి.సత్య శ్రీనివాసులు @ సత్తి,7) రాఘవన్ దినేష్ @ దినేష్, 8) యం. మణికంఠ, 9) ఎన్.మహబూబ్ బాష @ బుల్లక్,, 10) సాకే మహేష్,  మరియు 11) నాగ విజయ్ కుమార్ @ భీమా లు లతో  సమావేశము అయ్యి మురళిని చంపడానికి పథకం వేసినారు.  గుజ్జుల గజేంద్ర మరియు సాకే మహేష్ లు హత్యకు అవసరమయిన డబ్బులు ఇస్తామని చెప్పినారు. ముద్దాయిలలో ఒక్కడయిన దినేష్ కొందరు తమిళ వారిని పిలిపించినాడు, వారికి అయ్యే ఖర్చులను గజేంద్ర మరియు మహేశ్ లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 21-12-2019 వ తేదీ సాయంత్రం వారు అందరూ ముందే వేసుకొన్న పథకం ప్రకారం పసుపులేటి మురళి @ బెల్టు మురళిని ని SK పాస్ట్ పుడ్ సెంటర్ ప్రక్కన సుబాష్ నగర్ టర్నింగ్ వద్ద ఉండగా చంపినారు. తర్వాత వారు ముందుగానే సిద్దంగా ఉంచుకొన్న ఒక ఆటో మరియు రెండు స్కూటీలలో పారిపోయినారు.

 

వార్తావాహిని