యూనిట్
Flash News
జంగారెడ్డి గూడెం రాజేశ్వరి నగర్ లో కార్డాన్ సెర్చ్

జంగారెడ్డి
గూడెం డిఎస్పీ శ్రీమతి స్నేహిత ఆధ్వర్యంలో 9 -1 -2020 న తెల్లవారు 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ కాలనీలో కార్డాన్ సెర్చ్
నిర్వహించారు. ఈ తనిఖీలలో సిఐ బి ఎం నాయక్, 9 మంది ఎస్సైలు,
200 మంది సిబ్బంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిని,
ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా
తనిఖీలు చేసారు. అదే విధంగా 34 మంది అనుమానిత వ్యక్తుల వేలి
ముద్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా సరి అయిన పత్రాలు లేని 52 మోటార్ సైకిళ్ళు, ఒక కారు, 92 గుట్కా
ప్యాకెట్లు మరియు 17 మంది అనుమానిత వ్యక్తులను అదుపులోనికి
తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందుకు గాను మొత్తంగా కాలనీలోని 400 ఇళ్లను
క్షుణ్ణంగా తనికీ చేయడమైనది.