యూనిట్
Flash News
ప్రేమించి వివాహమాడినవాడే యముడైనాడు

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి లో గత నెల 22 న మృతి చెందిన సాహాదుల రత్న తులసి మిస్టరీ వీడింది. ప్రేమించి పెళ్లి
చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కేసు వివరాలను తణుకు సీఐ డీఎస్.చైతన్యకృష్ణ
వెల్లడించారు. అత్తిలి
గ్రామానికి చెందిన ధనాల లోవరాజు అదే గ్రామానికి చెందిన సాహాదుల రత్నతులసిని 2017లో ప్రేమించి వివాహం
చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధించడంతో అత్తిలిలో కాపురముంటున్న
రత్నతులసీని తల్లి పద్మ తీసుకువెళ్లింది. గత నెల 21న ఆమె
తల్లిదండ్రులు పద్మ, వెంకటరావు ఉనికిలి వెళ్లారు. అదే సమయంలో
లోవరాజు వెళ్లి భార్య గొంతు నులమడంతో అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. ఆమె
తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడిఉన్న కుమార్తెను తణుకు,
అనంతరం ఏలూరు, ఆసుపత్రికి తరించారు. చికిత్స
పొందుతున్న రత్న తులసి 22న మృతి చెందింది. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు
నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి చంపబడ్టట్లు తేలడంతో హత్య కేసు
నమోదు చేశారు. కాపురానికి రావడంలేదని భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో
తేలిందన్నారు. కొవ్వూరు
డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తణుకు సీఐ నిందితుడిని అరెస్టు చేశారు.
అత్తిలి, తణుకు ఎస్ఐలు రాజకుమార్, డి.రవికుమార్,
అత్తిలి ఏఎస్ఐ రత్నారెడ్డి లను డీఎస్పీ అభినందించారు.