యూనిట్
Flash News
పోక్సో కేసు లో రెండు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు

పశ్చిమ
గోదావరి జిల్లా పేద వేగి పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయడమే కాకుండా 48 గంటల్లోన్నే ఛార్జిషీటు దాఖలు చేసినట్టు జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్
గ్రేవాల్ తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. మైనర్ బాలికకు జరిగిన అన్యాయం గురించి భాదిత బాలిక (15) తండ్రి
ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన పాల అనంతకుమార్ ఆమెను
పలుమార్లు వేధించాడు. కుటుంబ సభ్యు లకు ఆమె చెప్పడంతో పెద్దల ద్వారా మందలించినా
అనంతకుమార్లో మార్పు రాలేదు. ఈనెల 5వ తేదీన ఇంట్లో ఒంటరిగా
ఉన్న ఆ యువతి మెడలో పసుపు తాడు కట్టి బెదిరించి మోటారుసైకిల్పై తీసుకెళ్ళినట్లు
పిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఒ.దిలీప్ కిరణ్
పర్యవేక్షణలో ఏలూరు రూరల్ సీఐ ఎ. శ్రీనివాసరావు దర్యాప్తు చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో 48 గంటల్లోనే
ఛార్జిషీటును తగిన ఆధారాలతో సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ
మహిళలపై జరిగే ఘటనలకు సంబం దించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన
అరెస్ట్ చేసి ఛార్జిషీటులను కూడా తక్కువ సమయంలో కోర్టులో సమర్పించనున్నట్టు
తెలిపారు. కేసు విచారణలో సహకరించిన తడికలపూడి జడ్పీ హైస్కూల్ ప్రిన్సిపాల్,
డిస్ట్రిక్ట్ పి. పి డి.ప్రభాకర్ లను ఎస్పీ అభినందించారు.